ఆదిపురుష్ లక్షణ్ ఎవరో?

ప్రభాస్ – ఓం రనౌత్ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా ఆదిపురుష్ మూవీ తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ఆదిపురుష్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చెయ్యడమే కాదు… ఆదిపురుష్ [more]

Update: 2020-09-23 02:14 GMT

ప్రభాస్ – ఓం రనౌత్ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా ఆదిపురుష్ మూవీ తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ఆదిపురుష్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చెయ్యడమే కాదు… ఆదిపురుష్ కి సంబందించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఓం రనౌత్ ప్రభాస్ కి ఫోన్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆదిపురుష్ ప్రీ ప్రొడక్షన్స్ పనులు చూస్తున్నాడు. ప్రభాస్ కూడా ఆదిపురుష్ కోసం జిమ్ చెయ్యడమే కాదు…హిందీ లాంగ్వేజ్ పేరెక్ట్ గా నేర్చుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఇక దర్శకుడు ఓం రనౌత్ ఆదిపురుష్ నటీనటుల ఎంపిక ఒక్కొక్కరిగా చేపట్టాడు. ఇప్పటికే ఆదిపురుష్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని రావణ్ పాత్రకి ఎంపిక చేసిన ఓం రనౌత్ హీరోయిన్ విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. 

సౌత్ హీరోయిన్ అయితే సినిమాకి క్రేజ్ వస్తుందో రాదో అని ఓం రనౌత్ బాలీవుడ్ లోనే సీత ని పట్టుకునే పనిలో ఉన్నాడట. ఇక ఆదిపురుష్ లో ప్రభాస్ తమ్ముడిగా అంటే రాముడి తమ్ముడు లక్షణుడు పాత్రకి ఓ యంగ్ సౌత్ హీరోని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. గత ఏడాది గద్దలకొండ గణేష్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అథర్వ మురళి ని లక్షణుడి పాత్రకి ఎంపిక చేసినట్టుగా బిటౌన్ టాక్. ఓం రనౌత్ అధర్వ మురళికి ఫోన్ లోనే తన పాత్రని వివరించాడని.. పాన్ ఇండియా మూవీలో అలాంటి పాత్రని ఎవరు వదులుకుంటారు..అందుకే అధర్వ మురళి కూడా ఆదిపురుష్ లక్షణ్ పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

Tags:    

Similar News