ఏంటి ప్రభాస్ ఇది?

ప్రభాస్ ప్రస్తుతం కరోనా ఉన్నప్పటికీ రాధాకృష్ణ రాధేశ్యాం షూటింగ్ మొదలెట్టబోతున్నాడని టాక్. ఉంది. రాధేశ్యాం అవ్వగానే నాగ్ అశ్విన్ తో సెట్స్ మీదకెళతాడనుకున్న ప్రభాస్ ఎక్కువగా బాలీవడో [more]

Update: 2020-09-14 05:48 GMT

ప్రభాస్ ప్రస్తుతం కరోనా ఉన్నప్పటికీ రాధాకృష్ణ రాధేశ్యాం షూటింగ్ మొదలెట్టబోతున్నాడని టాక్. ఉంది. రాధేశ్యాం అవ్వగానే నాగ్ అశ్విన్ తో సెట్స్ మీదకెళతాడనుకున్న ప్రభాస్ ఎక్కువగా బాలీవడో డైరెక్టర్ తో చెయ్యబోయే ఆదిపురుష్ గురించి ఆలోచిస్తున్నదనిపిస్తుంది. అందుకే జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో ప్రభాస్ బాడీ ఫిట్ నెస్ లో బిజీగా ఉన్నాడనే టాక్ వినబడుతుంది. తాజాగా ఆదిపురుష్ దర్శకుడు కూడా ప్రభాస్ తో ఆదిపురుష్ మేకోవర్ గురించి చెబుతున్నాడు. అంటే ప్రభాస్ రాధేశ్యాం కన్నా, నాగ్ అశ్విన్ సినిమా కన్నా ఎక్కువగా ఆదిపురుష్ సినిమా మీదే బాగా ఇంట్రెస్ట్ పెడుతున్నాడనిపిస్తుంది. ఓం రనౌత్ మాటల్లో ప్రభాస్ ప్రస్తుతం లాంగ్వేజ్ ట్రైనింగ్ నడుస్తున్నట్లు చెబుతున్నాడు.

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ అతనికి అతనే హిందీలో డబ్బింగ్ చెబుతాడని ఓం రనౌత్ చెబుతున్న మాట. అందుకే ప్రభాస్ హిందీ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. మరి ఆదిపురుష్ సినిమా కథ పురాణాలకు సంబంధించింది కావడంతో.. హిందీలోనూ ప్రభాస్ పురాణం లాంగ్వేజ్ మాట్లాడడం మాములు విషయం కాదు. అందుకే ప్రభాస్ ముందు హిందీలో పట్టు సాధించడానికి కష్టపడుతున్నాడట. ఇక తర్వాత ప్రభాస్‌కు ఫిజికల్, క్యారెక్టర్ ట్రైనింగ్ మొదలవుతుందని ఓం రనౌత్ ఆదిపురుష్ పై తన స్పందన తెలిపాడు. ఇక ఇది కరోనా టైం కాబట్టి ప్రభాస్ కి తన పాత్ర గురించి కథ గురించి ఫోన్ లో వివరిస్తున్నాడట ఓం రనౌత్.

కరోనా లాక్ డౌన్ వలన ప్రబస్ తో మీటయ్యి చర్చించడానికి లేదని… కాబట్టే ఫోన్ సంభాషణ అని ఓం రనౌత్ చెబుతున్నాడు. ఇక లక్డౌన్ ముగిసినా కరోనా ఉధృతి తగ్గలేదని.. పరిస్థితులు అనుకూలించాక ప్రబస్ ని నేరుగా కలిసి చర్చిస్తామని చెబుతున్నాడు ఓం రనౌత్. మరి దర్శకుడు ఓం రనౌత్ మాటలను బట్టి ప్రభాస్ ఆదిపురుష్ పై బాగా గురి పెట్టినట్టుగా కనబడుతుంది. అందుకే మిగతా సినిమాలను లైట్ తీసుకుని ఆదిపురుష్ కోసం రెడీ అవుతున్నాడు.

Tags:    

Similar News