పోస్టర్ పై రానా అండ్ అల్లు శిరీష్ కామెంట్స్!

రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘వినయ విధేయ రామ’. వచ్చే నెల సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా [more]

Update: 2018-12-27 08:36 GMT

రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘వినయ విధేయ రామ’. వచ్చే నెల సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలను పెంచేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.

పోస్టర్ పై ఇలా….

ఈనేపధ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుతున్నారు. రాత్రి 9 గంటలకు థియేట్రికల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. అలానే జూక్‌బాక్స్‌ను కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే నిన్న కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. గుర్రం ను పైకి లేపి రామ్ చరణ్ చాలా సీరియస్ గా ఫైట్ చేయడానికి వెళ్తున్నట్టు కనిపించాడు. ఈ పోస్టర్ పై అల్లు శిరీష్ అండ్ రానా స్పందించారు.

స్క్రీన్ పై చూసేందుకు….

ఈ పోస్టర్ చాలా అద్బుత్యంగా ఉందని..సినిమాలో యాక్షన్ సీన్స్ బాగా తీసినట్టు నేను యూనిట్ ద్వారా విన్నానని చెప్పాడు. ఆ ఎపిసోడ్స్ ని స్క్రీన్ పై చూసేందుకు వెయిట్ చేస్తున్నాను. సినిమాకు ది బెస్ట్ ఇవ్వాలని రామ్‌చరణ్‌ కోసం గుర్రాన్ని నెదర్లాండ్స్‌‌ నుంచి తెప్పించారు అని అల్లు శిరీష్‌ ట్వీట్‌ చేశారు. ఈ పోస్టర్ చూడటానికి చాలా అద్భుతంగా ఉందని దగ్గుబాటి రానా అన్నాడు.

Tags:    

Similar News