వివిఆర్ ఆడియో గెస్ట్: ఒక పొలిటికల్ హీరో.. ఒక స్టార్ హీరో

Update: 2018-12-14 02:35 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ‘వినయ విధేయ రామ’ రూపొందిన సంగతి తెలిసిందే. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది ఒక్క సాంగ్ తప్ప. రేపటి నుండి ఆ సాంగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో జరగనుంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ నటి ఇషా గుప్తా స్టెప్ లు వేయనుంది.

ఇది ఇలా ఉండగా ఈచిత్రం యొక్క ఆడియో లాంచ్ 24 కానీ 27 తేదీల్లో ఏదొక రోజు హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్స్ గా రాజమౌళి..యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా వస్తారు అని ఫిలింనగర్ సమాచారం. అలానే కేటీఆర్ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు.

రామ్ చరణ్ - కేటీఆర్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. సో చరణ్ కోసం కేటీఆర్ వస్తాడని అంటున్నారు. దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమా యొక్క ప్రీ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగింది. జనవరి 11వ తేదీన విడుదల అవుతున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది

Similar News