విజయ్- కీర్తి స్పెషల్ రోల్స్

నిన్నమహాశివరాత్రి స్పెషల్ గా రిలీజ్ అయినా జాతి రత్నాలు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రిలీజ్ కు ముందే మార్కెట్ పరంగా మంచి బజ్ తెచ్చుకున్న జాతిరత్నాలు [more]

Update: 2021-03-13 04:07 GMT

నిన్నమహాశివరాత్రి స్పెషల్ గా రిలీజ్ అయినా జాతి రత్నాలు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రిలీజ్ కు ముందే మార్కెట్ పరంగా మంచి బజ్ తెచ్చుకున్న జాతిరత్నాలు స్పెషల్ పబ్లిసిటీ సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించింది. మార్నింగ్ షోస్ నుండే జాతిరత్నాలు థియేటర్స్ హౌస్ ఫుల్ గా కళకళలాడాయి. మార్నింగ్ షో టాక్ తో జాతి రత్నాలు సినిమాపై యూత్ లో మరింత క్రేజ్ పెరిగిపోయింది. జాతి రత్నాలుగా నవీన్ పోలిశెట్టి, ప్రియా దర్శి, రాహుల్ రామకృష్ణలు సినిమాకి బ్యాక్ బోన్ గా నిలవడం, అనుదీప్ కామెడీ మేకింగ్ హైలెట్ గా నిలవడంతో సినిమాకి మంచి టాక్ స్ప్రెడ్ అయ్యింది. అటు మీడియా సపోర్ట్ కూడా జాతి రత్నాలకు పుష్కలంగా ఉండడం.. మంచి రివ్యూస్ పడడంతో జాతి రత్నాలు హిట్ లిస్ట్ లో చేరిపోయింది.

ఇక జాతిరత్నాలు సినిమా ఇప్పుడు సర్ప్రైజ్ లతో నిండిపోయింది.. సినిమా విడుదలకు ముందు ఎలాంటి అనుమానాలు లేని ఈ సినిమాలో ఇద్దరు స్పెషల్ స్టార్ గెస్ట్ రోల్స్ చేసారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో గోల్డ్ ఫేస్ బాయ్స్ గా నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండలు నటించడంతో వాళ్ళు మంచి  ఫ్రెండ్స్ అయ్యారు. అలాగే నాగ్ అశ్విన్ కి విజయ్ కి ఉన్న అనుబంధంతో విజయ్ దేవరకొండ జాతి రత్నాలు లో ఓ స్పెషల్ కేరెక్టర్ చెయ్యడం యూత్ కి నిజంగా సర్ప్రైజ్. అలాగే నాగ్ అశ్విన్ మహానటి కీర్తి సురేష్ కూడా ఓ స్పెషల్ రోల్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నవీన్ పోలిశెట్టి, కీర్తి సురేష్ కాంబో సీన్స్ ప్రోమోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరాలవడంతో.. జాతి రత్నాలులో స్పెషల్ గా గెస్ట్ రోల్స్ వేసిన కీర్తి సురేష్, విజయ్ దేవరకొండలను చూసి అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. 

Tags:    

Similar News