విజయ్ సినిమా ఇంత చీపా?

విజయ్ దేవరకొండ హీరోగానే కాదు నిర్మాతగా కూడా మారాడు. కింగ్ ఆఫ్ ది హిల్స్ బ్యానర్ పై ‘మీకు మాత్రమే చెప్తా’ ను నిర్మించిన సంగతి తెలిసిందే. [more]

Update: 2019-10-29 10:20 GMT

విజయ్ దేవరకొండ హీరోగానే కాదు నిర్మాతగా కూడా మారాడు. కింగ్ ఆఫ్ ది హిల్స్ బ్యానర్ పై ‘మీకు మాత్రమే చెప్తా’ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇది త్వరలోనే రిలీజ్ కానుంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ అవుట్ రైట్ గా అమ్మడంతో పెట్టుబడి దాదాపుగా వెనక్కు వచ్చిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక శాటిలైట్ రైట్స్ ను మాటీవీ రెండు కోట్ల రూపాయలకు చేజిక్కించుకుందట.

కష్టపడ్డా ఫలితం లేదు…

ఇది ఇలా ఉంటే ఈ సినిమా డీల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాను విజయ్ మొదట ఈ డీల్ సెట్ చేసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్ వారితో సిఫార్సు చేయించాడని ఆ తరువాత డీల్ సెట్ అవ్వకపోవడంతో విజయ్ కూడా డైరెక్ట్ గా వారిని అప్రోచ్ అయ్యి రైట్స్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడని తెలుస్తుంది. విజయ్ ఇంత ప్రయత్నించినా సినిమా రైట్స్ కు పెద్దగా ధర పలకకపోవడం చూస్తుంటే విజయ్ తనకుండే క్రేజ్ తనే తగ్గించుకుంటున్నట్టుగా ఉందని అంటున్నారు. ఒకవేళ ఇంత కష్టపడినా శాటిలైట్ రైట్స్ కి కేవలం 2 కోట్లు మాత్రమే వచ్చాయని ఒకవేళ ట్రై చేయకపోయినా ఇంతే వచ్చేది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు

 

Tags:    

Similar News