రాజ్ తరుణ్ సినిమాలో విజయ్ హీరోయిన్

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సినిమాలోని అందరి జీవితాలు మారిపోతాయి అనుకున్నారు అంతా. అనుకున్నట్టుగానే హీరో విజయ్, డైరెక్టర్ సందీప్ ఫేట్ మారిపోయాయి. అలానే హీరోయిన్ షాలినీ పాండే [more]

Update: 2019-05-02 08:36 GMT

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సినిమాలోని అందరి జీవితాలు మారిపోతాయి అనుకున్నారు అంతా. అనుకున్నట్టుగానే హీరో విజయ్, డైరెక్టర్ సందీప్ ఫేట్ మారిపోయాయి. అలానే హీరోయిన్ షాలినీ పాండే జాతకం మారిపోతుందని అంతా ఊహించారు. ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఇక షాలినీకి తిరుగు ఉండదని అంతా భావించారు. కానీ ఆమెకు అవకాశాలు రావడం లేదు. అరకొరగా మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చింది. ‘మహానటి’ సినిమాలో చిన్న పాత్ర చేసిన షాలినీ ఆ తరువాత కళ్యాణ్ రామ్ 118 లో గ్లామరస్ పాత్ర చేసింది.

మేఘా ఆకాశ్ స్థానంలో…

ఇక రీసెంట్ గా రాజ్ తరుణ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ‘లవర్’ లాంటి ఫెయిల్యూర్ సినిమా తరువాత రాజ్ తరుణ్.. కృష్ణ దర్శకత్వంలో “ఇద్దరి లోకం ఒకటే” అనే సినిమా దిల్ రాజు బ్యానర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా షాలినీ పాండేను సెలక్ట్ చేశారు. నిజానికి షాలినీ ప్లేస్ లో మొన్నటివరకూ మేఘా ఆకాశ్ అనుకున్నారు. కానీ ఆమెకు బదులు ఇప్పుడు షాలినీ పాండేను ఫైనలైజ్ చేశారు. ఈ సినిమాతో అయినా షాలినీ మరిన్ని ఆఫర్స్ దక్కించుకుంటుందేమో చూద్దాం.

Tags:    

Similar News