తమిళ టాప్ హీరోతో విజయ్ సినిమా..!

Update: 2018-09-27 08:21 GMT

'అర్జున్ రెడ్డి' సినిమాతో ఎంత మంది జీవితాలు మారిపోయాయో అందరికీ తెలిసిన విషయమే. హీరోయిన్ గా నటించిన షాలిని ప్రస్తుతం వరస సినిమాలతో బిజీ అయ్యిపోయింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ 'అర్జున్ రెడ్డి' ని రీమేక్ చేస్తున్నాడు. తర్వాత మహేష్ తో ఓ సినిమా కూడా కంఫర్మ్ అయింది. ఇక హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో మార్కెట్ పెంచుకోవాలని అక్కడ డైరెక్టర్స్ తో కూడా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా 'నోటా' అనే సినిమా తమిళ..తెలుగు భాషల్లో రానుంది.

చాలాకాలంగా ఎదురు చూసినా...

ఇదిలా ఉంటే.. తమిళ నటుడు సూర్యకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అతను తమిళంలో ఏ సినిమాలో నటించినా అది తెలుగులో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ ను వసూల్ చేస్తుంది. అయితే ఎప్పటినుండో సూర్య తెలుగు హీరోతో మల్టీ స్టారర్ లో నటించాలని అనుకుంటున్నాడు. కానీ ఇంతవరకు అది వర్కవుట్ అవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ అదృష్టం విజయ్ దేవరకొండకు దక్కినట్టు తెలుస్తుంది. వీరి కాంబినేషన్ లో ఓ క్రేజీ సినిమా రూపొందబోతుంది.

పనులూ ప్రారంభమయ్యాయి...

“గురు” ఫేం సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. స్టూడియో గ్రీన్ పతాకంపై ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం సూర్య, విజయ్ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ 2019 మధ్యలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించనున్నాడు. విజయ్ రీసెంట్ మూవీ “నోటా” అక్టోబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

Similar News