శర్వా, సాయి వదిలేస్తే.. విజయ్ తగులుకున్నాడా?

విజయ్ దేవరకొండ కి డియర్ కామ్రేడ్ సినిమా ప్లాప్ అవడంతో… తాజా చిత్రం వరల్డ్ ఫెమస్ లవర్ మీద ఆశలు పెట్టుకున్నాడు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది [more]

Update: 2020-01-08 06:12 GMT

విజయ్ దేవరకొండ కి డియర్ కామ్రేడ్ సినిమా ప్లాప్ అవడంతో… తాజా చిత్రం వరల్డ్ ఫెమస్ లవర్ మీద ఆశలు పెట్టుకున్నాడు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు ఫెమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా చెయ్యడం అది కాస్త విడుదలకు సిద్దమవడం.. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఉన్న విషయం తెలిసిందే. మొన్న విడుదలైన వరల్డ్ ఫెమస్ లవర్ టీజర్ చూడగానే అందరూ ముక్త ఖంఠంతో ఈ సినిమా అర్జున్ రెడ్డి కి సీక్వెల్, విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నుండి బయటికి రాలేకపోతున్నాడంటూ సోషల్ ఇండియాలో ఆడుకుంటున్నారు. ఎవరెన్ని అన్న విజయ్ దేవరకొండ క్రేజ్ తో వరల్డ్ ఫెమస్ లవర్ టీజర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో కొనసాగుతుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ వరల్డ్ ఫెమస్ లవర్ కథని పట్టుకుని టాలీవుడ్ లో కొంతమంది యంగ్ హీరోలకు వినిపించాడట. అయితే కాస్త బోల్డ్ గా ఉన్న ఈ కథతో సినిమా చెయ్యడానికి శర్వానంద్ కానీ సాయి తేజ్ లాంటి యంగ్ హీరోలు ఆసక్తి చూపలేదని.. అయితే అర్జున్ రెడ్డి లాంటి కథలకు యూత్ లో క్రేజ్ ఉంటుంది అని విజయ్ దేవరకొండ ఈ వరల్డ్ ఫెమస్ లవర్ కథని ఓకె చేసాడని.. విజయ్ ఓకె అనడంతో డియర్ కామ్రేడ్ విడుదలకు ముందే ఈ సినిమాని క్రాంతి మాధవ్ పట్టాలెక్కించినట్లుగా సోషల్ మీడియా కథనం. మరి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మొదటిసారిగా నలుగురు హీరోయిన్స్ రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్యా రాజేష్‌, ఇసా బెల్లా లతో రొమాన్స్ చేస్తున్నాడు.

Tags:    

Similar News