ఒక వేళా ఓకె చెప్పెయ్యడు కదా ?

Update: 2018-12-16 04:28 GMT

గత కొన్నాళ్లుగా అస్సలు హిట్ అన్న పదానికే మొహం వాచిపోయిన దర్శకుడు పూరి జగన్నాధ్... ప్రస్తుతం యమ క్రేజ్ మీదున్న విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో మాములుగా ప్రచారం జరగడం లేదు. అసలే ప్లాప్స్ తో ఉన్న డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమానా అంటూ నోరెళ్లబెడుతున్నారు విజయ్ ఫ్యాన్స్. పూరి జగన్నాధ్ మరోపక్క హీరో రామ్ ని లైన్ లో పెట్టాడనే న్యూస్ వినబడుతుంది. అయితే విజయ్ దేవరకొండ తో ఖచ్చితంగా సినిమా చెయ్యాలని విజయ్ చుట్టూనే పూరి తిరుగుతున్నాడని న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతూనే ఉంది. ముందు రామ్ తో సినిమా చేసాక.. తర్వాత విజయ్ తో సినిమా చేసే ప్లాన్ లో పూరి జగన్నాధ్ ఉన్నాడు.

తాజాగా పూరి జగన్నాధ్ మరో స్టెప్ ముందుకేసాడు. అది కూడా హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ ని పట్టుకుని కథ చెప్పడం కష్టమనుకున్నాడేమో.. అందుకే విజయ్ దేవరకొండ ప్రస్తుతం కాకినాడలో డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ లో ఉంటే.. అక్కడికి పూరి వెళ్లి మరీ విజయ్ కి కథ వినిపించాడనే టాక్ నడుస్తుంది. ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ ఏ హీరో కోసం ఇంత డెస్పరేట్ గా ట్రై చేయలేదు. పూరి స్టోరీకి ప్లాట్ అయిన విజయ్.. పూరికి ఎస్ చెప్పెట్లుగానే ఉన్నాడట. పూరి జగన్నాథ్ తన సినిమాల్లో హీరోని విలక్షణమైన వ్యక్తిగా వైవిధ్యంగా.. చాల పవర్ ఫుల్ గా చూపిస్తాడు. అందుకే విజయ్ తొందరగా పూరి కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. మరోపక్క పూరి విజయ్ కి కాకినాడలో కథ వినిపించాడని.. కథ విన్న విజయ్ ఒక వేళా పూరికి ఓకె చెప్పెయ్యడు కదా.. అని విజయ్ ఫ్యాన్స్ కాస్త కంగారులో ఉన్నారట.

మరి నిజంగా విజయ్ ఓకె చెబితే ఫస్ట్ పూరి గట్టెక్కినట్లే. లేదంటే పూరి జగన్నాధ్ పని క్లోజ్ అంటున్నారు. ఎందుకంటే పూరి దర్శకత్వానికి కాలం చెల్లిందని.. హీరోలెవరు పూరితో సినిమాలు చెయ్యడానికి సాహసం చెయ్యడం లేదు. అందుకే ఇలాంటి టైం లో రామ్, విజయ్ లు పూరికి అవకాశమిస్తే అంతకన్నా పూరికి కావాల్సింది మరొకటి ఉండదు.

Similar News