విజయ్ తాకిడికి బాలీవుడ్ స్టార్స్ విలవిలలాడుతున్నారు

Update: 2018-08-21 02:58 GMT

'గీత గోవిందం' సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో విజయ్ దేవరకొండ ఆనందానికి హద్దులు లేవు. 'అర్జున్ రెడ్డి' లాంటి ట్రెండ్ సెట్ సినిమా తర్వాత మరో బ్లాక్ బస్టర్ రావడంతో విజయ్ అండ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న టైములో విజయ్ మూవీ గురించి బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ మరియు క్రిటిక్ తరుణ్ ఆదర్ష్ 'గీత గోవిందం' సినిమాపై ఒక ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ తో విజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సెన్సషన్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా అదే జోరుతో దూసుకెళ్తోంది. ఇప్పటికే అమెరికాలో 'గీత గోవిందం' 1.5 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. ఇక ఆస్టేలియాలో పరిస్థితి ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ అదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.

ఆస్టేలియాలో 'గీత గోవిందం'తో పాటు రెండు బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' మూవీ...జాన్ అబ్రహం నటించిన 'సత్యమేవ జయతే'. ఈ రెండు సినిమాలు 'గీత గోవిందం' ధాటికి నిలబడలేకపోతున్నాయని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ మూవీ 2 లక్టల డాలర్లకు పైగా వసూళ్లు చేసిందని తరుణ్ ఆదర్స్ ట్వీట్ చేశాడు. 'గోల్డ్' ,'సత్యమేవజయతే' రెండు సినిమాలు కలిసి 1.92లక్షల డాలర్లు మాత్రమే వసూళ్లు చేశాయని చెబుతున్నారు. దీని ప్రకారం చూసుకుంటే విజయ్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

Similar News