నా పై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం డియర్ కామ్రేడ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన [more]

Update: 2019-08-18 07:03 GMT

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం డియర్ కామ్రేడ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈచిత్రం యొక్క రిజల్ట్ గురించి తాజాగా విజయ్ దేవరకొండ స్పందించారు. ఆయన మాట్లాడుతూ…

తన పై తన సినిమాలపై కొంతమంది తెలుగు పరిశ్రమకు చెందినవారు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. డియర్ కామ్రేడ్ చిత్రం గురించి ఇలానే నెగటివ్ ప్రచారం చేసి ఆ సినిమాను చంపేశారు అన్నాడు. అయితే ఇటువంటివి నాకు కొత్తేమి కాదు. వీటిని ఎలా ఎదురుకోవాలో నాకు బాగా తెలుసు అని గట్టి గా సమాధానం ఇచ్చాడు.

పోతే రీసెంట్ గా జరిగిన సైమా అవార్డ్స్ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు, మరియు సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ స్టార్ కేటగిరీలకు గాను రెండు అవార్డులు సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

Tags:    

Similar News