విజయ్ దేవరకొండ – చిరు.. ఓ రూమర్!!

ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ ఏమిటి అంటే చిరు ఆచార్య లో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చెయ్యడమే కాదు.. చిరు తదుపరి చిత్రమైన లూసీఫర్  రీమేక్ [more]

Update: 2020-07-10 06:45 GMT

ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ ఏమిటి అంటే చిరు ఆచార్య లో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చెయ్యడమే కాదు.. చిరు తదుపరి చిత్రమైన లూసీఫర్  రీమేక్ లోను టాలీవుడ్, తమిళ నుండి బోలెడంతమంది నటినటుల పేర్లు వినబడుతున్నాయి. అది కూడా పాపులర్ నటుల పేర్లు. లూసిఫెర్ రీమేక్ లో చిరు చెల్లాయ్ పాత్రలో సుహాసిని, ఖుష్బూ, తాజాగా రోజా పేర్లు వినిపించాయి. ఇక లూసిఫెర్ లో కీలకమైన పృద్వి రాజ్ పాత్రకి ముందు దగ్గుబాటి హీరో రానా ఫిక్స్ అన్నారు. అలాగే లూసిఫెర్ లో బాబీ పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్ ప్లేస్ లోకి జగపతి బాబుని తీసుకొస్తే .. ఇప్పుడు పృద్వి రాజ్ పాత్రని టాలీవుడ్ టాప్ హీరో విజయ్ దేవరకొండ ని చేర్చారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ తో ఫైటర్ పాన్ ఇండియా మూవీచేస్తున్నాడు. తర్వాత వరసగా సినిమాలు లైన్ లో పెట్టిన విజయ్ దేవరకొండ చిరు సినిమాలో జస్ట్ గెస్ట్ రోలా అంటే సాధ్యమయ్యే పని కాదు…. సినిమాకి క్రేజ్ వస్తుంది అని పిలవడము కరెక్ట్ కాదు. ఆచార్య చరణ్ గెస్ట్ రోల్ అంటే… దాదపుగా 30 నిమిషాల రోల్ గనక ఒకే.. కానీ లూసిఫెర్ రీమేక్ లో పృద్వి రాజ్ పాత్ర కేవలం మోహన్ లాల్ కి సెక్యురిటిగాను, అలాగే వివేక్ ఒబెరాయ్ ని ట్రేస్ చేసేటప్పుడు, డ్రగ్స్ ఇండియాలోకి రాకుండా అడ్డుకునే టప్పుడు జస్ట్ యాక్షన్ సన్నివేశాల్లో తప్ప పృద్వి రాజ్ కి అంతగా కేరెక్టర్ లేదు. అలంటి పాత్ర విజయ్ దేవరకొండ చేయడమా అంటూ అయన సన్నిహితులు అంటున్నమాట. అంటే చిరు – విజయ్ కాంబో జస్ట్ రూమర్ అని అర్ధమవుతుంది. 

Tags:    

Similar News