విద్యాబాలన్ కు ఆత్మీయ స్వాగతం

Update: 2018-07-18 10:44 GMT

బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ నేడు ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి పూల బొకేతో విద్యాబాలన్ కు స్వాగతం తెలిపారు. అలాగే.. నందమూరి వంశం రివాజు ప్రకారం ఆమెకు చీరను బహుకరించారు.

బసవతారకం గురించి తెలుసుకునేందుకు...

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఆయన సతీమణి బసవతారకం పాత్ర పోషించనున్న విద్యాబాలన్ ఎన్.టి.ఆర్ కుటుంబ సభ్యుల నుంచి ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు.. బసవతారకం వ్యవహారశైలి ఎలా ఉంటుంది, ఆమెకు ఇష్టమైన విషయాలేమిటి, హాబీస్ ఏమిటి అనేవి లోకేశ్వరిని అడిగి తెలుసుకున్నారు విద్యాబాలన్. ఈ తేనీటి విందులో నందమూరి బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర దేవి, చిన్నకుమార్తె తేజస్విని, చిన్నల్లుడు శ్రీ భరత్ పాలుపంచుకున్నారు. విద్యాబాలన్ బుధవారం నుంచి ఎన్.టి.ఆర్ సెట్స్ లో పాల్గొననున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుగుతోంది.

Similar News