డైరెక్టర్స్ ని తనవైపు తిప్పుకుంటున్న కమెడియన్..!

Update: 2018-08-17 08:20 GMT

కమెడియన్ బ్రహ్మానందం శ్రీను వైట్ల 'రెడీ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుటి నుండి గత ఏడాది వరకు తెలుగు ఇండస్ట్రీకి తన కామెడీతో ఏకిపారేశారు ఆయన. కానీ గత ఏడాది నుండి చూసుకుంటే ఆయన కామెడీతో జనాలు విసిగెత్తిపోయి.. కొత్త వారిని కోరుకున్నారు. అదే సమయంలో చిన్నచిన్నగా వెన్నెల కిశోర్ చేసే కామెడీ జనాలకు నచ్చడంతో అతనిపై పడ్డారు డైరెక్టర్స్.

వెన్నెలతో అడుగుపెట్టి...

దేవా కట్ట తొలి చిత్రం 'వెన్నెల'తో మనకి నటుడిగా పరిచమైన వెన్నెల కిశోర్.. ఆ చిత్రం విజయం సాదించటంలో కీలక పాత్రను పోషించాడు. ఆ తర్వాత దాదాపు నాలుగైదు సంవత్సరాలు విరామం తీసుకొన్న కిశోర్ ‘కరెంట్, 'బిందాస్’లతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలు అతని లైఫ్ నే మార్చేశాయి అని చెప్పాలి. అక్కడ నుండి అతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.

బ్రహ్మానందం స్థానంలో...

గత కొంత కాలం నుండి కిశోర్ ప్రతి డైరెక్టర్ కు మోస్ట్ వాంటెడ్ అయ్యిపోయాడు. అతను చేసిన ప్రతి సినిమా విజయం సాధించడంలో ఆయన కీలక పాత్రను పోషిస్తున్నారు. 'మహానుభావుడు' సినిమా నుండి నిన్నటి 'చి ల సౌ', 'గీత గోవిందం' చిత్రాలలో ఆయన నటనకు, కామెడీకు ప్రేక్షకులు ఫిదా అయ్యిపోయారు. ఇక రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ అయిన 'గూఢచారి'లో నెగటివ్ రోల్ తో అదరకొట్టాడు. దీంతో కిశోర్ ప్రస్తుతం ఫుల్ బిజీ అయిపోయాడు. ఇక ఆయన హాస్య బ్రహ్మ బ్రహ్మనందం ను రీప్లేస్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Similar News