వెంకీతో ప్లాప్ డైరెక్టర్?

బాలీవుడ్ లో నిన్నగాక మొన్న అజయ్ దేవగన్ – టబు – రకుల్ ప్రీత్ జంటగా తెరకెక్కి విడుదలైన దే దే ప్యార్ దే… యావరేజ్ టాక్ [more]

Update: 2019-06-12 05:58 GMT

బాలీవుడ్ లో నిన్నగాక మొన్న అజయ్ దేవగన్ – టబు – రకుల్ ప్రీత్ జంటగా తెరకెక్కి విడుదలైన దే దే ప్యార్ దే… యావరేజ్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధించింది. రకుల్ ప్రీత్ ఆ సినిమా హిట్ తో కాస్త కుదుట పడింది కూడా. అజయ్ దేవగన్ స్టామినాతో సినిమాకి వచ్చిన కలెక్షన్స్ తో దే దే ప్యార్ దే హిట్ అన్న లెక్కల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఆ సినిమాని తెలుగులో వెంకటేష్ రీమేక్ చెయ్యబోతున్నాడు అంటూ ఓ న్యూస్ సోషల్, వెబ్ మీడియాలో హాలాహల్ చేసింది. వెంకటేష్ అజయ్ దేవగన్ పాత్రలో టబు హిందీలోలానే… తెలుగులోనూ వెంకీ సరసన నటించబోతుందంటూ ప్రచారం జరుగుతుంది.

ఇక రకుల్ ప్రీత్ పాత్రకి మరో హీరోయిన్ ని చూడాలని.. అయితే ఈ రీమేక్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారో అనే దాని మీద కాస్త సస్పెన్స్ ఏర్పడింది. మరి అజయ్ దేవగన్ 50 ఏళ్ళ వయసులో భార్యకు దూరమై మరో టీనేజ్ అమ్మాయికి దగ్గరయ్యే పాత్రలో చాలా అద్భుతంగా చేసాడు. అదే కేరెక్టర్ ని వెంకీ కూడా అద్భుతంగా పండిస్తాడని ఈసినిమా వెంకీ రీమేక్ చేస్తే బావుంటుందని అంటున్నారు. అయితే ఈసినిమాకి సాక్ష్యంతో ప్లాప్ కొట్టిన శ్రీవాస్ దర్శకత్వం వహిస్తాడనే ఊహాగానాలు వినబడుతున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కబోయే ఈ సినిమాని సాక్ష్యం సినిమా డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది

Tags:    

Similar News