ఆ న్యూస్ ట్రాష్ అంటున్న వెంకీ..!

తమిళనాట అప్పుడెప్పుడో బ్లాక్ బస్టర్ హిట్ అయిన విక్రమ్ వేద సినిమాని తెలుగులో ఇద్దరు స్టార్స్ కలిసి చేస్తున్నారని.. అందులో వెంకటేష్, రానా అని ఒకసారి.. తర్వాత [more]

Update: 2019-05-07 11:46 GMT

తమిళనాట అప్పుడెప్పుడో బ్లాక్ బస్టర్ హిట్ అయిన విక్రమ్ వేద సినిమాని తెలుగులో ఇద్దరు స్టార్స్ కలిసి చేస్తున్నారని.. అందులో వెంకటేష్, రానా అని ఒకసారి.. తర్వాత బాలకృష్ణ అని.. తాజాగా వెంకటేష్, నారా రోహిత్ చేయబోతున్నట్లుగా వార్త‌లు చ‌క్కర్లు కొడుతున్నాచి. తమిళనాట యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో పుష్కర్ గాయత్రి తెరక్కించిన ఈ సినిమా అక్కడ కోట్ల వర్షం కురిపించింది. అలాంటి సినిమాని తెలుగు హీరోలెవరు ముందుకొచ్చి రీమేక్ చేస్తారో కానీ… ఆ సినిమాలో వీళ్లే నటిస్తున్నారు అంటూ నెలకో న్యూస్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తుంది.

వెంక‌టేష్ చేయడం లేదు…

తాజాగా నారా రోహిత్, వెంకటేష్ కలిసి వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ తమిళ విక్రమ్ వేదని రీమేక్ చేయబోతున్నట్లుగా.. పాపం వినాయక్ రేంజ్ ఇలా రీమేక్ లకు పడిపోయింది అంటూ చాలానే న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి. తాజాగా వెంకటేష్ ఈ విక్రమ్ వేద సినిమాని రీమేక్ చెయ్యడం లేదని.. సురేష్ ప్రొడక్షన్ నుండి క్లారిటీ వచ్చింది. విక్రమ్ వేద తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటించనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని.. క్లారిటీ ఇచ్చింది సురేష్ ప్రొడక్షన్స్.. ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ షూటింగ్ లో బిజీగా ఉన్నారని… త్వరలోనే వెంకీ తదుపరి చిత్రాలను ప్రకటిస్తామని ఈ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

Tags:    

Similar News