వరుణ్ తేజ్ సినిమా ఆగిపోయిందా..?

Update: 2018-12-25 05:57 GMT

వరుణ్ తేజ్ నిధానంగా తన కెరీర్ ని దారిలో పెట్టుకుంటున్నాడు. విభిన్నమైన చిత్రాలు చేస్తూ అటు మాస్ ఆడియన్స్ ని, ఇటు క్లాస్ ఆడియన్స్ మెప్పిస్తున్నాడు. లేటెస్ట్ గా 'ఘాజి' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో “అంతరిక్షం” అనే స్పేస్ చిత్రం చేసాడు. డివైడ్ టాక్ తో పర్లేదు అనిపించుకున్న ఈ సినిమా ఊపులోనే “ఎఫ్ 2” ని రిలీజ్ చేస్తున్నాడు వరుణ్. సంక్రాంతి కానుకగా “ఎఫ్ 2” ప్రేక్షకుల ముందుకి రానుంది. వరుణ్ తేజ్ - వెంకటేష్ కలిసి ఈ మల్టీస్టారర్ లో నటిస్తున్నారు. మెహ్రీన్, తమన్నా హీరోయిన్స్ గా కనువిందు చేయనున్నారు.

కథ ఫైనల్ కాలేదా..?

పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తరువాత వరుణ్.. సాగర్ చంద్ర అనే దర్శకుడితో ఓ సినిమా చేయాల్సి ఉంది. “అయ్యారే”, “అప్పట్లో ఒకడుండేవాడు” లాంటి చిత్రాలు అందించిన ఈ దర్శకుడితో వరుణ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేసాడు. కానీ ఈ ప్రాజెక్ట్ అనుకుని దాదాపు ఏడాది గడుస్తున్నా ఇంకా కథ కొలిక్కి రాలేదట. భారీ బడ్జెట్ కావడంతో 14 రీల్స్ సంస్థ కూడా ఏమి పట్టించుకోకపోవడంతో ఈ సినిమా ఇప్పటిలో సెట్స్ మీదకు వెళ్లదని..ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లే అని చెబుతున్నారు. మరి “ఎఫ్ 2” తరువాత వరుణ్ ఏ సినిమా చేస్తాడో ఇంకా కంఫర్మ్ కాలేదు.

Similar News