వరుణ్ తేజ్ కు అంత నిర్లక్ష్యం దేనికి..?

Update: 2018-12-17 06:51 GMT

మరో ఐదు రోజుల్లో వరుణ్ తేజ్ నటించిన 'అంతరిక్షం' సినిమా విడుదలవ్వబోతుంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా ప్రీ రిలీజ్ బాగానే జరిగింది. 'ఘాజి' ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని క్రిష్ నిర్మిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుంటే ఈ సినిమాకు సంబంధించి ఒక్క ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయలేదు టీం. ప్రమోషన్ లో ముఖ్యుడైన వరుణ్ తేజ్ ప్రస్తుతం హైదరాబాద్ లో లేదట. ఆయన ప్రస్తుతం ముంబైలో ఉన్నాడని తెలుస్తుంది. వరుణ్ తన నెక్స్ట్ మూవీ కోసం డ్రెస్ సెలక్షన్ కు ముంబై వెళ్లాడని సమాచారం. కానీ మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి అప్పటికి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చేస్తాడని అంటున్నారు.

ఈ టైంలో ముంబైకి ఎందుకు..?

ప్రమోషన్స్ కి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ సరిపోతుందా..? బుధ, గురు వారాల్లో సినిమాను ఏం ప్రమోట్ చేస్తారు..? అయినా వరుణ్ తన సినిమాల ప్రమోషన్ చేయకుండా ముంబై ఎందుకు వెళ్లినట్టు..? అని ప్రశ్నలు మీద ప్రశ్నలు సోషల్ మీడియాలో అడుగుతున్నారు ఫ్యాన్స్. ఈ కాలంలో ఎంత పెద్ద సినిమాకైనా ప్రమోషన్స్ చాలా అవసరం. 'బాహుబలి' లాంటి మూవీకే ప్రమోషన్స్ తప్పలేదు. మరి 'అంతరిక్షం' ఎందుకు లేట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు.

Similar News