'ఎఫ్‌2' రిలీజ్ సంక్రాంతికి వద్దంటున్న వరుణ్..!

Update: 2018-11-23 09:03 GMT

ఈ సంక్రాంతికి మూడు సినిమాలు షెడ్యూలై ఉన్నాయి. 'ఎన్టీఆర్' బయోపిక్, 'వినయ విధేయ రామ', 'ఎఫ్‌ 2' సంక్రాంతి రేస్ లో రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు చిత్రాలు దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి. ప్రతి సంక్రాంతికి తన బ్యానర్ నుండి కచ్చితంగా ఒక సినిమా అయిన ఉండేలా చూసుకుంటాడు దిల్ రాజు. అందుకే ఈ సంక్రాంతికి 'ఎఫ్‌2' ను మన ముందుకు తీసుకుని రానున్నాడు. వరుణ్ తేజ్ - వెంకటేష్ నటిస్తున్న ఈ చిత్రం మిగిలిన రెండు చిత్రాలకి పోటీ కాదు. ఎందుకంటే 'ఎన్టీఆర్' ఏమో బయోపిక్ తరహా సినిమా కాగా..'వినయ విధేయ రామ' మాస్‌ ఎంటర్‌టైనర్‌. 'ఎఫ్‌2 ' ఏమో కామెడీ ఎంటర్టైనర్. మూడూ మూడు సపరేట్ జోనర్స్ కాబట్టి దీన్ని ఆదరించే ప్రేక్షకులు దీనికి ఉంటారని దిల్ రాజు నమ్మకం. అయితే హీరో వరుణ్ తేజకి సోదరుడి చిత్రంతో పోటీగా తన సినిమా విడుదల కావడం ఇష్టం లేదట.

సంక్రాంతే సరైన సమయం అంటున్న దిల్ రాజు

ఆలా చరణ్ కు ఎదురు వెళ్తే మెగా ఫాన్స్‌ నుంచి సపోర్ట్‌ రాదనేది అతని భయమట. వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు కూడా ఇదే దిల్ రాజుకి సూచించాడట. సంక్రాంతికి కాకుండా జనవరి 25న విడుదల చేయాలని దిల్‌ రాజుని కోరుతున్నాడట. 'అంతరిక్షం', ఎఫ్‌ 2 మధ్య కూడా కనీసం నెల రోజులైనా గ్యాప్‌ ఉంటే బాగుంటుదని నాగబాబు ఆలోచనట. మరి బిజినెస్ మైండ్ తో ఆలోచించే దిల్ రాజు అందుకు ఒప్పుకుంటాడో లేదో తెలియాలి. ఒకవేళ రేస్ నుండి వరుణ్ తేజ్ తప్పుకుంటే అఖిల్ 'మిస్టర్‌ మజ్ను'ను సంక్రాంతికి రేస్ లోకి దింపనున్నాడు. త్వరలోనే 'ఎఫ్‌ 2' రిలీజ్ పై క్లారిటీ రానుంది.

Similar News