సినిమా రిలీజ్ అవ్వకుండా సీక్వెలా

Update: 2018-12-16 11:10 GMT

సాధారణంగా సినిమా హిట్ అయితే దాని ప్రకారం సీక్వెల్ తీస్తారు. కానీ ‘అంత‌రిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’ ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఈసినిమా యొక్క సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారట. ఇది ఆఫిషల్ గా అనౌన్స్ చేయకపోయినా ప్రొడ్యూసర్ క్రిష్ ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. 'ఘాజీ' లాంటి సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న సంక‌ల్ప్ రెడ్డి ‘అంత‌రిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’ ను డైరెక్ట్ చేసాడు. వరుణ్ తేజ్ - అదితి రావ్ హైద‌రీ - లావ‌ణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రంపై సంబంధించి ఆల్రెడీ సీక్వెల్ స్టోరీ ని రెడీ చేసేసాడట డైరెక్టర్ సంకల్ప్.

ఎలాగూ ఈ సినిమా కోసం వేసిన సెట్ ఉంది కాబట్టి కొంత ఖర్చు కలిసి వస్తుంది ప్రొడ్యూసర్ క్రిష్ భావిస్తున్నాడట. సినిమా రిజల్ట్ బట్టి సీక్వెల్ ని ప్లాన్ చేయాలనీ చూస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు. ఈచిత్రం కోసం అత్యున్న‌త సాంకేతిక విభాగం ప‌ని చేశారు. ప్రత్యేకంగా హాలీవుడ్ నుండి యాక్ష‌న్ నిపుణులను పిలిపించి వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో 'అంత‌రిక్షం' చిత్రానికి అద్భుత‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీక‌రించారు.

సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ హైలైట్ గా నిలుస్తాయి . రెండు రోజులు కిందట సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాను క్రిష్ జాగ‌ర్ల‌మూడి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, వై రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా ప్ర‌శాంత్ విహారి సంగీతం అందించాడు. రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈసినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈనెల 21 న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈసినిమాతో పాటు కెజియఫ్..పడి పడి లేచే మనసు...మారి 2 రిలీజ్ అవుతున్నాయి.

Similar News