సైరా అప్ డేట్

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా ను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. [more]

Update: 2019-06-12 08:10 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా ను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు 200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తుంది. మరికొన్ని ముఖ్య పాత్రల్లో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ కనిపించనున్నారు.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం ‘పాండిచ్చేరి’లో షూటింగు జరుపుకుంటోంది. అక్కడ బ్రిటిష్ కాలానికి చెందిన కొన్ని భవనాలు ఉండటంతో, ఆ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలను అక్కడే ప్లాన్ చేశారట. నరసింహా రెడ్డి కి…బ్రిటిష్ వారి మధ్య జరిగే ఒప్పందానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి అని చెబుతున్నారు.

ఇక ఈమూవీ యొక్క టీజర్ ను చిరంజీవి పుట్టినరోజున అంటే ఆగస్టు 22వ తేదీన రిలీజ్ చేయనున్నారు. టీజర్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ని అధికారంగా కూడా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు

Tags:    

Similar News