'హిరణ్య కశిప' ఆగలేదట..!

Update: 2018-11-07 06:46 GMT

'రుద్రమదేవి' లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత డైరెక్టర్ గుణశేఖర్ 'హిరణ్య కశిప' అనే సినిమాను తీయనున్నట్టు ప్రకటించాడు. టైటిల్ రోల్ లో దగ్గుబాటి రానా నటించనున్నాడని..సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మించబడుతుంది చెప్పాడు గుణశేఖర్. ఆ తరువాత ఏమైందో ఏంటో ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి అప్ డేట్స్ కూడా ఆగిపోయాయి. ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ల‌లేదు. దాంతో ఈ సినిమా ఇక లేనట్టే అని ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో నిర్మాత సురేష్ బాబు 'అదుగో' సినిమా ప్రమోషన్స్ లో మీడియా తో మాట్లాడుతూ.... గుణశేఖర్ తో 'హిరణ్య కశిప' సినిమా ఆగలేదని క్లారిటీ ఇచ్చారు.

అన్ని భార‌తీయ భాష‌ల్లో

అంతేకాదు ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయని.. డైరెక్టర్ గుణశేఖర్ వైపు నుంచి కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి చెప్పాడు. గ్రాఫిక్స్ వర్క్ లండన్ లో జరగనున్నాయని ఈ మూవీకు రానాయే నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలిపాడు. ఈ సినిమాను ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. భారీ బడ్జెట్ తో రూపొందుతుంది కాబట్టి షూటింగ్ ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు సురేష్ బాబు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి చెప్పారు.

 

Similar News