పాపం శ్రీదేవి కూతురు?

శ్రీదేవి కూతురు ధఢక్ సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కరణ్ జోహార్ హాండ్స్ నుండి జాన్వీ కపూర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. [more]

Update: 2020-08-03 10:27 GMT

శ్రీదేవి కూతురు ధఢక్ సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కరణ్ జోహార్ హాండ్స్ నుండి జాన్వీ కపూర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ కి అదే శాపం అయ్యింది. జాన్వీ కపూర్ నటించిన రెండో సినిమాని కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ వారి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పుడదే జాన్వీ కొంప ముంచెట్లుగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో నేపోటిజం పై రచ్చ మాములుగా లేదు. సుశాంత్ సింగ్ మరణంతో ఆయన అభిమానులు బాలీవుడ్ లో నేపోటిజం పైన అలాగే సినిమా నేపథ్యం ఉన్న వారసులపై కత్తి కట్టారు. అందులో భాగంగానే  కార్గిల్ వార్‌లో ఇండియా తరఫున పోరాడిన లైడీ పైలెట్‌ గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా సినిమాపై సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమాని బాయ్ కట్ చెయ్యాలని అంటున్నారు. తాజాగా విడుదలైన గుంజన్ సక్సేనా ట్రైలర్ చూసిన వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

కరణ్ జోహార్ ని టార్గెట్ చేస్తూ టాలెంట్ లేని స్టార్ కిడ్స్‌ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఇండస్ట్రీని నాశనం చేస్తున్నావ్ అని… కరణ్ నిర్మించిన గుంజన్ సక్సేనా సినిమాను చూడొద్దంటూ.. వెంటనే బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. గుంజన్ సక్సేనా ట్రైలర్ చూసి జాన్వీ కపూర్ ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఫేస్‌లో ఏ చిన్న ఎక్స్‌ప్రెషన్ కూడా లేకుండా ఉన్న జాన్వీ కపూర్ ఈ పాత్రకు అర్హురాలు కాదంటూ జాన్వీ ని కలిపి ఆడుకుంటున్నారు. రేపు 12 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోయే ఈ సినిమా గనక థియేటర్స్ లో విడుదలై ఉంటే.. ఖచ్చితంగా ఆ సినిమా ని చూడకుండా థియేటర్స్ దగ్గర సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు ధర్నా చేసేవారే. కానీ ఆ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన.. ఆ సినిమాని వీక్షించే వారు తక్కువ ఉంటే గనక నిజంగా కరణ్ కి జాన్వికి అది పెద్ద దెబ్బె అని చెప్పాలి. 

Tags:    

Similar News