త్రివిక్రమ్-మహేష్ కు లింక్ తెగిపోయిందా?

Update: 2018-08-08 07:54 GMT

మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ కాంబినేషన్ లోనే 'ఖలేజా' సినిమా వచ్చింది. కానీ సినిమా అంతగా ఆడలేదు కానీ ఇప్పటికీ ఆ సినిమాను టీవీలలో వేస్తే కచ్చితంగా చూస్తున్నారు. ఆ సినిమాను ఇప్పటికీ ఇష్టపడుతున్నారు. మళ్లీ ఆ తర్వాత ఆ కాంబినేషన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. వాస్తవానికి త్రివిక్రమ్ తో మహేష్ సినిమా హారిక హాసిని బ్యానర్ లో ఉంది. కానీ హారిక హాసిని మహేష్ కి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసేసుకోవడంతో ఇంకా ప్రస్తుతం ఆ బ్యానర్ లో మహేష్ సినిమా లేనట్టే అని అర్థం అవుతుంది. త్రివిక్రమ్ ఆ బ్యానర్ లోనే ఎక్కువ సినిమాలు చేయడం అందుకు కారణం అని తెలుస్తుంది.

వారిద్దరి సినిమాలు ఇప్పట్లో ఉండవా..?

నిజానికి త్రివిక్రమ్ మైత్రీ మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ మైత్రీ మూవీస్ వారు సుకుమార్ - మహేష్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. త్రివిక్రమ్ ఇక బన్నీతో చేయనున్నాడని టాక్. త్రివిక్రమ్ - మహేష్ గతంలో చాలా కమర్షియల్ ప్రకటనలు చేసారు. అందులో ఒకటి అభిబస్ కమర్షియల్ కూడా. అయితే రీసెంట్ గా దానికి సంబంధించి మరో యాడ్ ను కొరటాల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే, ఇక మహేష్-త్రివిక్రమ్ లింక్ తెగిపోయినట్లే కనిపిస్తోంది. మహేష్ - సుకుమార్ సినిమా తర్వాత మహేష్... బోయపాటి, రాజమౌళి... ఇలా లైన్ అప్ ఉంది. సో ఇక త్రివిక్రమ్-మహేష్ సినిమాను మరిచిపోవడమేనేమో?

Similar News