అవకాశాలేనప్పుడు... కథ నచ్చలేదని చెబితే నమ్ముతారా..?

Update: 2018-08-02 08:44 GMT

గతంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన త్రిషకి ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే అమ్మడు తెలివిగా లేడి ఓరియెంటెడ్ ఫిలిమ్స్ తో బిజీబిజీగా మారిపోయింది. అయితే త్రిషకి లేడి ఓరియెంటెడ్ మూవీస్ కూడా పెద్దగా కలిసొచ్చినట్లుగా అనిపించడం లేదు. నాయకి, మొన్నటికి మొన్న మోహిని రెండు చిత్రాలు తెలుగు, తమిళంలోనూ ఫ్లాప్ గా నిలిచాయి. మొన్నామధ్యన త్రిష పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా వార్తలొచ్చాయి. అదేం లేదు అవన్నీ గాసిప్స్.. నేను పెళ్లి చేసుకుంటే మీకు చెప్పే చేసుకుంటానని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే త్రిష మీద కోలీవుడ్ నిర్మాతల మండలిలో ఒక ఫిర్యాదు ఈ ఏడాది మొదట్లో నమోదైంది.

కథ తనకు తగ్గట్లుగా లేదనే...

అది కూడా హరి - విక్రమ్ స్వామి స్క్వేర్ సినిమా నుండి త్రిష హఠాత్తుగా బయటికి రావడంతో.. స్వామి నిర్మాతలు త్రిష మీద కంప్లయింట్ చేశారు. అయితే ఆ సినిమాలో మరో హీరోయిన్ కీర్తి సురేష్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి.. తనని సెట్స్ లో పట్టించుకోకపోవడం వల్లనే త్రిష ఆ సినిమా నుండి బయటికొచ్చిందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ విషయమై త్రిష ఒక ఇంటర్వ్యూ లో స్పందిస్తూ స్వామి స్క్వేర్ నుండి బయటికి రావడానికి గల కారణాన్ని వివరించింది. స్వామి స్క్వేర్ సినిమా కథ తనకు తగ్గట్లుగా లేదన్న కారణంతోనే ఆ సినిమా నుండి బయటికి వచ్చానని.. అసలు సినిమా షూటింగ్ లో నేను ఒక్క రోజు కూడా పాల్గొనలేదని... నేను బయటికి వచ్చేసరికి ఆ సినిమా షూటింగ్ లో నేను పాల్గొనకుండానే బయటికొచ్చానని క్లారిటీ ఇచ్చింది.

త్రిష చెప్పింది నిజమేనా..?

ఇకపోతే త్రిష ప్లేస్ లోకి ఈ మధ్యన దర్శకుడు హరి.. ఐశ్వర్య రాజేష్ ని తీసుకున్నాడు. అయితే త్రిష తనకు స్వామి స్క్వేర్ కథ తన రేంజ్ కి తగ్గట్లుగా లేదని చెప్పడాన్ని కొందరు తప్పు పడుతున్నారు. అసలు అవకాశాలు లేని త్రిష స్వామి స్క్వేర్ కథ గురించి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు. ఆమెకి ఇంకేదో ప్రాబ్లెమ్ ఉండబట్టే త్రిష అలా ఆ సినిమా నుండి బయటికొచ్చేసింది అంటున్నారు. మరి త్రిష నిజమే చెప్పిందా... లేదా అందరు అనుకున్నట్టుగా మరేదన్నా కారణం ఉందంటారా... ఏమో ఆ దేవుడికే తెలియాలి మరి.

Similar News