వెంకీ కోసం పంథా మార్చిన డైరెక్టర్..!

Update: 2018-10-26 10:06 GMT

సినిమా చూపిస్త మావా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే అంటూ మూడు చిత్రాలను ఒకే మాదిరిగా తెరకెక్కించి యావరేజ్ హిట్స్ అందుకున్న త్రినాధరావు నక్కిన కొత్తగా మాత్రం ట్రై చెయ్యడం లేదు. మొదటి రెండు సినిమాలను హీరోయిన్ తండ్రిని వేపుకు తినే కుర్రాళ్లను హీరోలుగా ప్రెజెంట్ చేసిన త్రినాధరావు నక్కిన... హలో గురు లో మాత్రం అమ్మాయి తండ్రితోనే హీరో ఫ్రెండ్షిప్ చెయ్యడం అనే కాన్సెప్ట్ తో సినిమా చేసాడు. మూడు సినిమాలు అటు ఇటుగా ఒకేలాంటి కథతో.. విభిన్న కథనంతో సినిమాలను చేసిన త్రినాధరావు నక్కిన నెక్స్ట్ ప్రాజెక్ట్ విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నాడట. ఇప్పటికే వెంకటేష్ రెండు మల్టీస్టారర్ మూవీస్ లో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 అనే కామెడీ ఎంటెర్టైనెర్ లో అని రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న వెంకీ నాగ చైతన్య తో మరో మల్టీస్టారర్ ని బాబీ దర్శకత్వంలో మొదలెట్టేసాడు.

వెనువెంటనే మూడు సినిమాలు...

అయితే తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాల్సి ఉండగా త్రివిక్రమ్ కి అరవింద సమేత తర్వాత ఎవరితో చెయ్యాలో క్లారిటి లేక ఖాళీగా ఉండడం, ఈలోపు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి ట్రై చేస్తున్నాడని వార్తలొస్తున్న నేపథ్యంలో వెంకటేష్ ఈ త్రినాధరావు నక్కిన కి కమిట్ అయ్యాడంటున్నారు. ఇప్పటికే త్రినాధరావు నక్కిన, వెంకటేష్ కి కథా చర్చలు జరిగినట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే త్రినాధరావు నక్కిన చెప్పిన మాస్ లైన్ నచ్చి వెంకటేష్ అతనితో సినిమాకి కమిట్ అయ్యాడట. త్రినాధరావు నక్కిన తీసిన మూడు సినిమాలకు కాస్త డిఫరెంట్ గా వెంకీ సినిమా ఉండబోతుందట. ఇకపోతే గురు తర్వాత ఇంతవరకు వెంకీ సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న సినిమాలు వరసగా విడుదలయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి.

Similar News