మీడియం హీరోలకు ఆ నిర్మాత దొరకడం కష్టం..!

Update: 2018-11-28 07:51 GMT

ఈమధ్యన మైత్రి మూవీస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యువి క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కన్నా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తో నిర్మిస్తున్న సినిమాల జోరే ఎక్కువగా ఉంది. దానయ్య గతంలో సూపర్ హిట్ సినిమాలు చేసినా... ఇప్పుడు చేస్తున్న సినిమాలతోనే ఆయన ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ భారీ నిర్మాతగా మారిపోయాడు. అందుకే మీడియం రేంజ్ హీరోలను కన్నెత్తి కూడా ఈ నిర్మాత చూడడం లేదు. ఇక ప్రస్తుతం ఒక మీడియం రేంజ్ హీరో ఆయనతో సినిమా చెయ్యాలన్నా సాధ్యమయ్యే పనిలా కనబడడం లేదు.

అన్నీ భారీ సినిమాలే...

ప్రస్తుతం దానయ్య రెండు మెగా ప్రాజెక్టులను చేస్తున్నాడు. ఈ ఏడాది భరత్ అనే నేను సినిమా చేసిన దానయ్య వెంటనే రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాని పట్టాలెక్కించాడు. అంతేకాకుండా మరో భారీ సెన్సేషనల్ గా నిలుస్తున్న #RRR ని పట్టాలెక్కించేశాడు. రాజమౌళి దర్శకత్వంలో నిర్మితమవుతున్న ఈ సినిమా బడ్జెట్ క్లారిటీ లేదు కానీ.. 300 కోట్ల పైమాటే కానీ తక్కువ లేదు. అంతేకాకుండా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని దానయ్య సెట్ చేసాడనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఒక హిలేరియస్ ఎంటర్ టైనర్ కూడా ప్లాన్ చేయబోతున్నట్టు చెబుతున్నారు.

మూడేళ్లలో వెయ్యి కోట్ల బిజినెస్

ఒకవేళ అదే నిజమైతే... ఇన్ని ప్రాజెక్టుల్ని దానయ్య హ్యాండిల్ చెయ్యడం సాధ్యమా ? అలాగే మొత్తం అన్ని లెక్కేసుకుని చూసుకుంటే సుమారు వెయ్యి కోట్ల దాకా పెట్టుబడులు, బిజినెస్ ఈ మూడేళ్లలోనే దానయ్య చేయబోతున్నాడని అర్థమవుతోంది. మరి ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ చిన్న హీరోలను దానయ్య సైడ్ చేస్తున్నట్టే కనబడుతుంది. మరి భారీగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాలన్నీ భారీ హిట్స్ కొడితే.. దానయ్య ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం.

Similar News