అఖిల్ పార్టీలో వాళ్లిద్దరూ..!

అక్కినేని అఖిల్ నటించిన మూడో సినిమా మిస్టర్ మజ్ను రేపు శుక్రవారం థియేటర్స్ లోకి దిగబోతుంది. అఖిల్ కి టాలీవుడ్ లోని చాలామంది స్టార్ హీరోలతో సన్నిహిత [more]

Update: 2019-01-23 08:16 GMT

అక్కినేని అఖిల్ నటించిన మూడో సినిమా మిస్టర్ మజ్ను రేపు శుక్రవారం థియేటర్స్ లోకి దిగబోతుంది. అఖిల్ కి టాలీవుడ్ లోని చాలామంది స్టార్ హీరోలతో సన్నిహిత సంబంధాలున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా చాలామందితో మంచి రిలేషన్ ని అఖిల్ మెయింటైన్ చేస్తున్నాడు. నాగచైతన్యలా సైలెంట్ గా ఉండకుండా అఖిల్ చాలా యాక్టీవ్ గా ఉంటాడు. హలో సినిమా అప్పుడు చిరుని, చరణ్ ని గెస్ట్ లుగా పిలిచి మా పెదనాన్న చిరు, చరణ్.. అన్నతో సమానమన్న అఖిల్… మిస్టర్ మజ్ను ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పిలిస్తే.. నాగార్జున నా పెద్దకొడుకు తారక్ అంటూ స్పీచ్ ఇచ్చాడు. మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ పాల్గొని అఖిల్ గురించి చాలానే చెప్పాడు. ఇక అఖిల్ కి రామ్ చరణ్ మిస్టర్ మజ్ను ట్రైలర్ చూసి విష్ చేసాడు.

ఈవెంట్ జరిగిన రోజే…

తాజాగా అఖిల్, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసున్న ఒక పిక్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. అయితే అఖిల్ మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ వచ్చాడు కానీ చరణ్ రాలేదు. అదే రోజు అఖిల్ ఇచ్చిన స్పెషల్ పార్టీకి మాత్రం రామ్ చరణ్ కూడా అఖిల్, ఎన్టీఆర్ లతో జాయిన్ అయ్యాడు. రామ్ చరణ్, అఖిల్, ఎన్టీఆర్ కలిసి మిస్టర్ మజ్ను పార్టీని బాగా ఎంజాయ్ చేసినట్లుగా కనబడుతుంది. అదే రాత్రే ఆ పార్టీ జరిగిందనడానికి ప్రూఫ్ ఎన్టీఆర్ షర్ట్. ఎన్టీఆర్ మిస్టర్ మజ్ను ఈవెంట్ కి హాజరైన షర్ట్, ఆ పార్టీలో షర్ట్ ఒక్కటే కావడంతో.. ఈవెంట్ జరిగిన రాత్రే అఖిల్ తన ఎన్టీఆర్, చరణ్ కి మంచి పార్టీ ఇచ్చినట్లుగా ఉంది. మరి ఆ విధంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు అఖిల్ గాలం వేసాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. ఏదేమైనా అఖిల్, ఎన్టీఆర్, చరణ్ ల ఫోటో మాత్రం నెట్ లో బాగా వైరల్ అయ్యింది.

Tags:    

Similar News