ఆ ప్రొడ్యూసర్ ని చూసి అసూయ పడుతున్నారు!

రీసెంట్ గా జరిగిన ‘వినయ విధేయ రామ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ…”డీవీవీ దానయ్య ను చూసి చాలామంది నిర్మాతలు అసూయ పడుతున్నారు..ఆయన [more]

Update: 2018-12-29 09:39 GMT

రీసెంట్ గా జరిగిన ‘వినయ విధేయ రామ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ…”డీవీవీ దానయ్య ను చూసి చాలామంది నిర్మాతలు అసూయ పడుతున్నారు..ఆయన చాలా లక్కీ” అని అన్నారు. దానయ్య ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు అయితే క్రేజీ కాంబినేషన్ లతో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఎవరికి దక్కని క్రేజీ ప్రొజెక్ట్స ని దానయ్య సొంతం చేసుకుంటున్నారు.

వినయ విధేయ రామతో….

ప్రస్తుతం దానయ్య బోయపాటి – చరణ్ కాంబినేషన్ లో ‘వినయ విధేయ రామ’ ను నిర్మించాడు. పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. అలానే టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ ప్రోజెక్ట్ ని కూడా నిర్మిస్తున్నాడు దానయ్య. జక్కన్న డైరెక్షన్ లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ లను పెట్టి #RRR అనే చిత్రం ను భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు. ఇది 2020 లో రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉండగా మరో క్రేజియస్ట్ కాంబినేషన్ కు శ్రీకారం కి చుట్టాడు.

ఎవరూ ఊహించని విధంగా….

అదే త్రివిక్రమ్ – చిరంజీవి సినిమా. ఎవరు ఊహించని విధంగా ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దీన్ని రామ్ చరణే సెట్ చేసాడని ప్రి రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి అన్నారు. ఈనేపధ్యంలో చిరు మాట్లాడుతూ…”దానయ్య ఒక పక్క #RRR తీస్తూనే మరోపక్క నాది త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ను తీయబోతున్నాడు. ఆయన అనడమే కాదు చాలా మంది టాప్ ప్రొడ్యూసర్స్ దానయ్య ను చూసి అటువంటి కాంబినేషన్స్ తమకు ఎందుకు రావడంలేదు అని అసూయ పడుతున్నారు.

Tags:    

Similar News