ఇక బాక్సాఫీస్ లో సందడే

మార్చి 29న టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర మూడు నాలుగు సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. గత నెల రోజులుగా బోసిపోయిన థియేటర్స్ అన్ని మార్చి 29 నుండి కళకళలాడనున్నాయి. [more]

Update: 2019-03-23 06:50 GMT

మార్చి 29న టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర మూడు నాలుగు సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. గత నెల రోజులుగా బోసిపోయిన థియేటర్స్ అన్ని మార్చి 29 నుండి కళకళలాడనున్నాయి. ఈ వారం ఏవో డబ్బింగ్, బూతు సినిమాలు బరిలోకి దిగితే ప్రేక్షకులు ఆ సినిమాలను అలాగే వెనక్కి పంపించేందుకు రెడీ అయ్యారు. ఇక విద్యార్థుల పరీక్షల సమయం ముగియడంతో.. ఇక చిన్నా పెద్ద సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చెయ్యడానికి సిద్ధమవుతున్నాయి. వచ్చే శుక్రవారం లక్ష్మీస్ ఎన్టీఆర్, నిహారిక.. సూర్యకాంతం, నిఖిల్.. అర్జున్ సురవరం సినిమాలు ప్రేక్షకుల ముందు రావడానికి రెడీ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండ గెస్ట్ గా…

రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకించి ప్రమోషన్స్ చెయ్యకపోయినా రోజూ లక్ష్మీస్ ఎన్టీఆర్ మీడియాలో నానుతూ ఉండేలా భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని థియేటర్స్ లో చూస్తామా అనే క్యూరియాసిటీని వర్మ ప్రేక్షకుల్లో కలిగించాడు. ఇక మెగా డాటర్ నిహారిక కూడా సూర్యకాంతం ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. ఈరోజు జరగబోయే సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏ మెగా హీరోనో గెస్ట్ గా వస్తాడనుకుంటే.. ప్రస్తుతం యూత్ లో భారీ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ గెస్ట్ అన్నారు. దీంతో సూర్యకాంతం మీద యూత్ లో క్రేజ్ వచ్చేసింది.

సినిమా విడుదలపై నీలినీడలు

ఇక మిగిలిన మరో సినిమా అర్జున్ సురవరం. ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ మీడియాలో వినిపించడం లేదు. నిన్నమొన్నటి వరకు టైటిల్ విషయంలో తెగ హైలెట్ అయిన అర్జున్ సురవరం విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. గత ఏడాది నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు మార్చి 29న విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఇపుడు చడీచప్పుడు చెయ్యడం లేదు. అసలు నిఖిల్ ఈసారైనా ప్రేక్షకుల ముందుకు వస్తాడా రాడా అనేది మాత్రం ఫుల్ సస్పెన్స్ అన్నట్టుగా ఉంది. అసలే క్రేజ్ లేని ఈ సినిమా విడుదలపై కమ్ముకున్న నీలి నీడలను నిఖిల్ ఎలా తొలిగిస్తాడో చూడాలి.

Tags:    

Similar News