ఈ బయోపిక్ అంతా కామెడినేనా?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ గతంలో ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ [more]

Update: 2019-07-18 07:31 GMT

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ గతంలో ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ తీసాడు. మూడో చిత్రం గా దీనిని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

స్టూవర్ట్ పురం గజదొంగ కథతో….

ఇందులో దొంగతనం చేసే సన్నివేశాలు చాలా ఉంటాయి అంట. అలానే సినిమాలో ఫన్ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ టైగర్ నాగేశ్వరరావు 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు. అప్పట్లో ఆయన చేసినవి అన్ని సినిమాలో చూపించనున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. ఇందులో ఆమె వేశ్య పాత్రలో నటిస్తునప్పటికీ…కొన్ని సీన్స్ లో పోలీస్ గెటప్ లో కనిపించనుంది. ఈమూవీకి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. త్వరలోనే మిగిలిన డీటెయిల్స్ తెలియనున్నాయి.

Tags:    

Similar News