టికెట్ ఫినాలే కోసం ఆ నలుగురు!

బిగ్ బాస్ సీజన్ 4 టికెట్ టు ఫినాలే లో కంటెస్టెంట్స్ కొట్లాట మాములుగా లేదు. ఒకరికొకరు తిట్టుకుంటూ బిగ్ బాస్ గేమ్ వాడేస్తున్నారు.  టికెట్ టు [more]

Update: 2020-12-02 11:31 GMT

బిగ్ బాస్ సీజన్ 4 టికెట్ టు ఫినాలే లో కంటెస్టెంట్స్ కొట్లాట మాములుగా లేదు. ఒకరికొకరు తిట్టుకుంటూ బిగ్ బాస్ గేమ్ వాడేస్తున్నారు.  టికెట్ టు ఫినాలే కోసం అరియనా, అవినాష్, మోనాల్, అఖిల్, అభిజిత్, సోహైల్, హరికలు గట్టిగానే పోటీ పడ్డారు. అయితే అందులో అవినాష్ ముందే ఎలిమినేట్ అయ్యాడు. దానితో తనని ఎవరూ గేమ్ ఆడనివ్వడం లేదంటూ సింపతీ స్టార్ట్ చేసాడు. అందరూ కలిసికట్టుగా గేమ్ ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యాడు. ఇక అవినాష్ అయితే ఎలాగైనా గెలవాలని మోసం కూడా చేద్దామనుకున్నాడు. అంటే పాలలో నీళ్లు కలపడం, ఎవరూ చూడకుండా ఇంట్లోని పాలు కలిపెయ్యడంతో బిగ్ బాస్ అవినాష్ ని ఈ టాస్క్ నుండి తప్పించాడు. మోసం చేసైనా.. గెలవాలన్న అవినాష్ కి బిగ్ బాస్ ఝలక్ ఇచ్చాడు. ఇక పాల బాటిల్ తక్కువ ఉన్న కారణంగా అరియానని ఈ టాస్క్ నుండి బయటికి పంపేశాడు బిగ్ బాస్.

అరియానని టికెట్ టు ఫినాలే టాస్క్ నుండి బిగ్ బాస్ తప్పించడంతో అరియనా ఏడుపు స్టార్ట్ చేసింది. నేను ఎలాగైనా ఫైనల్స్ కి వెళ్ళాలి, టాప్ 5 లో ఉండాలి అంటూ ఏడవడంతో అవినాష్ అరియానని ఓదార్చే ప్రయత్నం చేసాడు. నువ్వు వెళ్తావ్, నువ్వు గెలుస్తావ్ అంటూ అరియనాకి ఓదార్చాడు. ఇక ఎవరెలా ఉన్న మోనాల్ సింగిల్ గ గేమ్ ఆడినా మోనాల్ కూడా ఈ గేమ్ నుండి బయటికి వచ్చేసింది. ఈ టికెట్ ఫినాలే లో సెకండ్ రౌండ్ లోకి హారిక, అభిజిత్, అఖిల్ అండ్ సోహైల్ లు వెళ్లారు. మరి ఆ టికెట్ టు ఫినాలే కార్డు ఎవరికీ దక్కుతుందో.. అనేది ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది. కాకపోతే ఆ కార్డు కోసం హారిక – సోహైల్ లు గట్టిగానే గొడవపడుతున్నారు. అదేమిటో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Tags:    

Similar News