'చిత్రలహరి' విషయంలో జాగ్రత్త పడుతున్నాడు..!

Update: 2018-08-13 06:17 GMT

వరసగా ఆరు ఫ్లప్ లు వస్తే ఏ హీరో తట్టుకుంటాడో చెప్పండి? కానీ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు వరసగా ఆరు ఫ్లాప్స్ వచ్చినా తన గత చిత్రాల విజయాలు, మెగా బ్రాండ్ తో ఇప్పటివరకు లాకొచ్చాడు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిల్లో అతనికి కచ్చితంగా హిట్ అవసరం. అందుకే తన మేకోవర్ కోసం అమెరికాకి వెళ్లాడు. అక్కడ ఫిట్ నెస్ తో పాటు జుట్టు గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొత్త రూపంతో తిరిగి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

చిత్రలహరి పైనే ఆశలన్నీ

అతను తిరిగి రాగానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. 'నేను శైలజ' ఫేమ్ తిరుమల కిశోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి 'చిత్రలహరి' అనే టైటిల్ పెట్టారు. 'బార్ అండ్ రెస్టారెంట్' అనేది ట్యాగ్ లైన్. ఇక తేజుకి జోడీగా తొలిసారిగా నివేదా థామస్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ దర్శకుడు తిరుమల కిశోర్ కి కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం.

కామెడీతో పాటు సెంటిమెంట్ కూడా...

అటు తేజుకి..ఇటు కిశోర్ కి ఈ సినిమా చాలా కీలకం అవ్వడంతో స్క్రిప్ట్ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్టు టాక్. ఇందులో చిత్ర, లహరి అనే రెండు పాత్రలు హీరోయిన్ల పేర్లట. మరి కింద బార్ అండ్ రెస్టారెంట్ ఎందుకు పెట్టారు అనేది సస్పెన్స్ గా ఉంచుతున్నారు. హీరోకి, అతని తండ్రికి మధ్య సెంటిమెంట్ సీన్స్ ఇందులో బాగా హైలైట్ అవుతాయి అంట. కామెడీ ప్లస్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తండ్రి పాత్ర కోసం శాండల్ వుడ్ కు చెందిన ఓ సీనియర్ స్టార్ హీరోతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉంది.

Similar News