తారక్.. నువ్వు మిస్ అయ్యావ్!

Update: 2018-06-08 08:50 GMT

ఎన్టీఆర్ - పూజాహెగ్డే కాంబినేషన్ లో మాటల మాంత్రికుడు తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమా ప్రస్తుతం మూడవ షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పూజ.. తనకు సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయిందని..త్రివిక్రమ్ తో ఒక సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ తో తన అభిమానులతో ఆనందాన్ని షేర్ చేసుకుంది. డైలీ సెట్‌కి రావడం చాలా ఉత్సాహంగా అనిపించేదని, తారక్‌.. నువ్వు మిస్సయ్యావ్‌. ఈసారి కలిసినప్పుడు మనం ఫోటో దిగుదాం అని తన ట్విట్టర్ పోస్ట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ కి జోడిగా పూజ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దసరాకు సినిమాను రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Similar News