బ్రహ్మ తర్వాత మళ్లీ మంచి పేరొచ్చింది..!

Update: 2018-08-25 06:24 GMT

టాలీవుడ్ లో సక్సెస్ కాలేక ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వెయ్యడానికి కష్ట పడుతున్న తాప్సి అవకాశమొస్తే తెలుగులోనూ నటిస్తుంది. బాలీవుడ్ కి చెక్కేసిన తాప్సి తెలుగు దర్శక నిర్మాతలను కామెడీగా మాట్లాడినప్పటికీ.. మళ్లీ తెలుగులో అవకాశాలొస్తే వదలడం లేదు. మొన్నీ మధ్యన ఆనందో బ్రహ్మ సినిమాతో కామెడీ హిట్ అందుకున్న తాప్సి.. ఆ సినిమాలో ఆత్మగా అందరినీ మెప్పించింది. చనిపోయి ఆత్మగా మారి అల్లరి చేసే క్యారెక్టర్ లో తాప్సి ఆకట్టుకుంది. ఇక తాజాగా ఆది పినిశెట్టి హీరోగా రితిక సింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన నీవెవరో సినిమాలో తాప్సి కీలక పాత్రలో అదరగొట్టింది. ఆ సినిమాలో తాప్సి పన్ను ఆది పినిశెట్టికి ధీటుగా నటించి మెప్పించింది.

నీవెవరోలో మంచి మార్కులు...

వెన్నెలగా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో తాప్సి నటన చాలా బావుంది. ఆ సినిమాలో సంపన్నులైన అంధులను ఎంచుకుని.. వారిని ప్రేమలో దింపి... వారి నుండి డబ్బు తీసుకుని మోసం చేసే క్యారెక్టర్ లో అదరగొట్టింది. ఆది పినిశెట్టిని అంధుడిగా ఉన్నప్పుడు ప్రేమలోకి దింపి అతని నుండి 20 లక్షలు కొట్టేసి పారిపోవాలనుకుంటే.. ఆదికి అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరిగి... తాప్సి కి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేకపోయినా.. కళ్ళు వచ్చాక తాప్సి ని వెతుకుతూ పొతే.. తాప్సి గురించిన నిర్ఘాంతపోయే నిజాలు తెలుసుకోవడం.. చివరికి తాప్సి జైలుకెళ్లడం వంటి సీన్స్ లో తాప్సి మంచి పెరఫార్మెన్స్ ఇచ్చింది. నీవెవరో సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ... తాప్సి నటనకు మాత్రం ఫుల్ మార్కులు పడుతున్నాయి. మరి వెన్నెలగా అందరినీ మెప్పించిన తాప్సి కి టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు మాత్రం రావడం లేదు. చూద్దాం మళ్లీ తాప్సి ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో అనేది.

Similar News