అరవింద్ కాదు.. ఈసారి మమ్ముట్టి?

Update: 2018-09-11 06:44 GMT

తమిళ హీరో జయం రవి అన్నయ్య మోహన్ రాజా డైరెక్షన్ వచ్చిన ’తని ఒరువన్’ సినిమాలో జయం రవి, నయనతార జంటగా నటించారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ హీరో అరవింద స్వామి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు రావడమే కాదు అతని పాత్ర సినిమాకే హైలైట్ అయింది. చాలా కాలం తర్వాత ఆయన తమిళ ఇండస్ట్రీలోకి ఈచిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.

తెలుగులో ధృవగా.....

ఈ సినిమాను తెలుగులో ‘ధృవ’ అనే టైటిల్ తో రామ్ చరణ్ హీరోగా సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా అరవింద స్వామియే ప్రతినాయకుడు. ఇక్కడ కూడా ఈ చిత్రం విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ తమిళంలో సేమ్ కాంబినేషన్ లో అంటే జయం రవి , మోహన్ రాజా కాంబినేషన్ లో ‘తని ఒరువన్ 2’ తెరకెక్కనుంది. ఇందులో ఈసారి నయన్ కి బదులు కాజల్ అండ్ సాయేషా కథానాయికలుగా నటించనున్నారు.

విలన్ పాత్రలో....

మొదటి పార్ట్ లా ఈ పార్ట్ లో కూడా విలన్ పాత్ర సినిమాకి హైలైట్ కానుందట. అయితే ఈసారి ఆ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నారట. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి వుంది. మమ్ముట్టి ప్రస్తుతం తెలుగులో ‘యాత్ర’ అనే చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నారు. పార్ట్ 2 లో అరవింద స్వామి కి బదులు మమ్ముట్టి ని ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నారో తెలియాల్సిఉంది. మరి ఈ చిత్రంని కూడా తెలుగులో రీమేక్ చేస్తారా? అన్న విషయంపై కూడా క్లారిటీ రావాలి.

Similar News