సరిలేరు కోసం తమ్మూతో పాటుగా మరో ఐటెం గర్ల్?

మహేష్ బాబు – రష్మిక మందన్న కాంబోలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా పాటలు త్వరలోనే అంటే ఈ నెల 16 నుండి [more]

Update: 2019-11-10 03:52 GMT

మహేష్ బాబు – రష్మిక మందన్న కాంబోలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా పాటలు త్వరలోనే అంటే ఈ నెల 16 నుండి మార్కెట్ లో హడావిడి చెయ్యబోతున్నాయి. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను యూత్ ని ఓ ఊపు ఊపడం ఖాయమనే టాక్ వినబడుతుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా తో పోటీ పడుతున్న అల వైకుంఠపురములో పాటలకన్నా సరిలేరు పాటలే అదిరిపోతాయనే నమ్మకం తో మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు. దేవిశ్రీ కూడా మహేష్ కి బెస్ట్ మ్యూజిక్ ఇస్తానని మహేష్ ఫ్యాన్స్ కి హమి కూడా ఇచ్చాడు.

ఇక మహేష్ బాబు… రష్మిక తో డ్యూయెట్స్ తో పాటుగా ఐటెం సాంగ్ లోను అదరగొట్టేస్తాడట. సరిలేరు ఐటెం పాటని దేవిశ్రీ ప్రత్యేకంగా కంపోజ్ చేసాడని, ఈ పాటతో సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోతాయని అంటున్నారు. ఇక ఈ ఐటెం కోసం టాప్ హీరోయిన్ తమన్నా కూడా తన డాన్స్ తో అదరగొట్టెయ్యనుంది. తాజా సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రెండు ఐటెం సాంగ్స్ ఉండబోతున్నాయని, ఈ రెండిటీని దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలు కంపోజ్ చేసి పెట్టాడట. మరి ఐటమ్స్ స్పెషలిస్ట్ అయిన దేవిశ్రీ అదిరిపోయే ఐటెం మ్యూజిక్ ఇస్తే.. ఓ సాంగ్ తమన్నా ఆడుతుంది. మరో సాంగ్ కి మరో హాట్ హీరోయిన్ స్పెషల్ గా తేబోతున్నారట. అయితే ఈ సినిమాలో రెండో ఐటెం పాటలున్నట్టుగా బయటికి లీక్ కాకుండా కాపాడి.. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులను ఫాన్స్ ని థ్రిల్ చెయ్యాలని చిత్ర బృందము భావిస్తోందట.

Tags:    

Similar News