ఐటెమ్ కాదులెండి

Update: 2018-04-26 03:37 GMT

సురేందర్ రెడ్డి - రామ్ చరణ్ - చిరంజీవి కలయికలో 'సై రా నరసింహారెడ్డి' చిత్రం భారీ బడ్జెట్ తో భారీగానే తెరకెక్కుతున్నది ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్లో ఉన్న 'సై రా నరసింహారెడ్డి' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొన్నామధ్యన చిరు అమెరికా పర్యటలో ఉండడంతో కాస్త విరామం తీసుకున్న సైరా యూనిట్ చిరు రాకతో మళ్ళీ షూటింగ్ మొదలెట్టేసింది. ప్రస్తుతం చిరు - నయనతార కాంబినేషన్స్ సీన్స్ ని సురేందర్ రెడ్డి చిత్రీకరిస్తున్నారు. మెయిన్ హీరోయిన్ గా నయనతార నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా కూడా నటిస్తుందనేది కన్ఫర్మ్ అయ్యింది.

అయితే తమన్నా కి సై రా లో వచ్చిన అవకాశాన్ని బంపర్ ఆఫర్ గా చెప్పుకుంటున్న జనానికి... తమన్నా సై రా లో కేవలం ఒక గెస్ట్ పాత్ర అయినా.... లేదంటే ఏదన్న ఒక ఐటెం లో అయినా చేస్తుందేమో అనుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం తమన్నా కెరీర్ చెప్పుకోదగిన విధంగా లేదు. అలాంటి టైం లో తమన్నాకి సై రా లో ఛాన్స్ అనగానే న అందరూ అలాగే చిన్నదేదో తగిలిందిలే అనుకున్నారు. అయితే సై రా నరసింహరెడ్డి లో తమన్నా పాత్ర చాలా కీలకమైందట.

సై రా లో తమన్నా నరసింహా రెడ్డి తరఫున శత్రువులపై పోరాడే వీరనారిగా కనిపించనుందని ఫిలింనగర్ టాక్. నరసింహా రెడ్డి కోసం తన ప్రాణాలను త్యాగం చేసే వీరనారి పాత్రను తమన్నా పోషించనుందని చెబుతున్నారు. ఇంతకుముందు తమన్నా 'బాహుబలి'లో పోరాట సన్నివేశాల్లోను అద్భుతంగా నటించడంతో ఆమెను సురేందర్ రెడ్డి సై రా కోసం ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. మరి జాతీయ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సై రా మీద భారీ అంచనాలు ఉన్నాయి

Similar News