తమన్నాకి అంత ఇస్తున్నారా?

ప్రస్తుతం ఓటిటి హావ జోరుగా ఉంది. థియేటర్స్ లాక్ డౌన్ నడుస్తుంది కాబట్టి.. అందరూ ఓటిటి ల మీదే పడ్డారు. అందుకే ఇప్పుడు అందరూ ఓటిటి లను [more]

Update: 2020-06-30 07:12 GMT

ప్రస్తుతం ఓటిటి హావ జోరుగా ఉంది. థియేటర్స్ లాక్ డౌన్ నడుస్తుంది కాబట్టి.. అందరూ ఓటిటి ల మీదే పడ్డారు. అందుకే ఇప్పుడు అందరూ ఓటిటి లను లైం టైం లో తేవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఓటిటి ల హవా పెరుగుతుంది అనుకున్న అల్లు అరవింద్ కరోనా కన్నా ముందే ఆహా అంటూ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ని మొదలుపెట్టాడు. అయితే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి వాటి ముందు ఆహా ఓటిటి ప్లాట్ ఫార్మ్… ఓహో అన్నట్టుగా మిగిలిపోవడంతో.. ప్రస్తుతం ఓటిటీస్ కి ఉన్న క్రేజ్ తో అల్లు అరవింద్ ఆహా మీద క్రేజ్ తెచ్చే ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాడు. దాదాపుగా 80 కోట్లు పెట్టిన అరవింద్ అండ్ బ్యాచ్ ఇంకా పెట్టుబడిని ఆహా కి ఎక్కిస్తూనే ఉన్నారు. అయినా లాభాలు మాత్రం ఇప్పుడప్పుడే వచ్చేలా కనిపించకపోవడంతో.. ఆహాని భారీగా ప్రమోట్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

ఇప్పటికే ఆహా కి కి విజయ్ దేవరకొండ ని బ్రాండ్ అంబాసిడర్ గ చేసిన అరవింద్.. ఇప్పుడు ఆహా ప్రమోషన్స్ కి తమన్నాని వాడుతున్నారు. తమన్నా హోస్ట్ గ ఆహా నుండి ఓ షో రాబోతుంది. అందులో తమన్నా హోస్ట్ గా సెలెబ్రిటీస్ ని ప్రశ్నలడుగుతూ ఆహా ని ప్రమోట్ చేస్తూ ఆ షోని ఆడిస్తుంది. అయితే తమన్నా లాంటి క్రేజీ హీరోయిన్ ని తీసుకుని ఆహా ని ఆహా అన్న రేంజ్ లో ప్రమోట్ చేయించే ప్లాన్స్ లో భాగంగా తమన్నా కి భారీగానే ముట్ట జెబుతున్నారట. హీరోయిన్స్ ఆఫర్స్ తగ్గినా.. ఐటెం సాంగ్స్ తోనో మారేదన్నా అవకాశాలతోనో రెచ్చిపోతున్న తమన్నా కి ఆహా కి హోస్ట్ చేసినందుకుగాను… ఒక్కో ఎపిసోడ్ కి 8 నుండి 10 లక్షల పారితోషకం ఇవ్వబోతున్నారని టాక్. వారానికి ఓ ఎపిసోడ్ చొప్పున.. తమన్నాతో ఇలాంటి ఎపిసోడ్స్ నెలకి ఐదారు చేయించాలని చూస్తున్నారట. మరి ఆ లెక్కన నెలకు ఐదు వేసుకున్న తమన్నాకి 50 లక్షలు ముడతాయన్నమాట,. ఇక తమన్నా షో ని కేవలం ఆహా ప్లాట్ ఫారం మీద నుండే కాకుండా ఓ టివి ఛానల్ లోను ప్రసారం చేస్తారని తెలుస్తుంది.

Tags:    

Similar News