వ్యాపార రంగంలోకి తమన్నా

Update: 2018-09-13 07:40 GMT

టాలీవుడ్ లో స్టార్ హీరోల పక్కన చేసి స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా వ్యాపారంలో కూడా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హీరోలు వ్యాపార రంగంలో రాణించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ హీరోయిన్స్ మాత్రం వ్యాపారంపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. అయితే ఆ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ సెంటర్స్ వ్యాపారంను ప్రారంభించింది. హైదరాబాద్ లో ఆమెకు పలు బ్రాంచులు కూడా ఉన్నాయి. అలానే ఇప్పుడు తమన్నా వ్యాపార రంగంలో అడుగు పెట్టబోతోంది.

అది కూడా సద సీదా వ్యాపారం కాదు చాలా ఖరీదైన వజ్రాల వ్యాపారంను త్వరలోనే తమన్నా స్టార్ట్ చేస్తుందంట. దీనికి సంబంధించి తమన్నా అధికారికంగా ప్రకటించింది. వినాయక చవితి రోజున తన పేరు మీద కొత్త డైమండ్ జ్యూవెలరీ బ్రాండ్ను ప్రారంభించబోతున్నట్లుగా ఆమె పేర్కొంది. ఇప్పటివరకు ఇండియాలోనే ఏ సెలబ్రిటీకి తన పేరు మీద జ్యూవెలరీ బ్రాండ్ లేదు. కానీ మొదటి సారి తమన్నా తన పేరుపై బ్రాండ్ ను విడుదల చేస్తుంది.

ఈమధ్య సినిమాల్లో అంతగా రాణించలేకపోతున్న ఈ అమ్మడు తన అదృష్టాన్ని వ్యాపారంలో పరిశీలంచుకోబోతుంది. సినిమాలు వస్తాయో రావో అని చాలా ముందు చూపుతో వ్యాపారం రంగంలోకి అడుగు పెడుతుంది. ఇక ఈమె తెలుగులో ‘ఎఫ్ 2’ చిత్రంతో పాటు 'క్వీన్' రీమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరెండు సినిమాల తర్వాత ఆమె చేతిలో పెద్దగా సినిమాలు ఉన్నట్టు కనపడంలేదు. దాంతో మెల్ల మెల్లగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యే ఆలోచనలో ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇలా జరిగితే తమన్నా ఫ్యాన్స్ ఏం అయిపోతారు? చూద్దాం వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్న తమన్నా ఏ స్థాయిలో రాణిస్తుందో.

Similar News