విజయశాంతి ప్లేస్ లోకి టబు..!

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. 1992 బ్యాక్ డ్రాప్ తో సాగే [more]

Update: 2019-04-17 10:30 GMT

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. 1992 బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ థ్రిల్లర్ మూవీలో రానాకి జోడిగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. తొలిసారి రానాతో సాయి పల్లవి నటిస్తుంది. అలానే ఓ ముఖ్య పాత్రలో సీనియర్ హీరోయిన్ టబు నటిస్తున్నట్లు సమాచారం. అయితే నిజానికి టబు పాత్ర మరో సీనియర్ హీరోయిన్ విజయశాంతి చేయాల్సి ఉంది.

పాండురంగడు తర్వాత…

మొదట చిత్రబృందం విజయశాంతిని సంప్రదించగా ఆమె ఓకే కూడా చెప్పి తరువాత అడిగిన డేట్లు కేటాయించలేకపోవడంతో సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. అలా విజయశాంతి ప్లేస్ లోకి టబు వచ్చింది. టబు తెలుగులో 2008లో ‘పాండురంగడు’ సినిమాలో కనిపించింది. ఈమె గత కొంతకాలంగా బాలీవుడ్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Tags:    

Similar News