సైరా రిలీజ్ ను ఫిక్స్ చేసుకున్న చరణ్

Update: 2018-06-04 03:18 GMT

మెగా స్టార్ చిరంజీవి ఖైదీ 150 తర్వాత చేస్తున్న చిత్రం 'సైరా' నరసింహారెడ్డి. భారీ బడ్జెట్‌ తో చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ తో పాటు.. విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

చిరుకి జోడిగా కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. దాదాపు 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను 2019 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. భారీ బడ్జెట్ సినిమా కావటంతో సమ్మర్ లో రిలీజ్ అయితే కలెక్షన్స్ బాగా వచ్చే అవకాశం ఉందని నిర్మాత రామ్ చరణ్ అటు దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమాకి భారీ లెవెల్ లో గ్రాఫిక్స్‌వర్క్‌ ఉండడంతో షూటింగ్ ను త్వరగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కు త్వరగా పంపాలని ప్లాన్‌ చేస్తున్నారు చిత్ర యూనిట్. మరో పక్క చిరంజీవి ఈ సినిమాతో పాటు కొరటాల సినిమాకి కూడా డేట్స్ ఇచ్చినట్లు సమాచారం.

Similar News