నరసింహ రెడ్డి గూడెం రెడీనా

చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న సై రా నరసింహ రెడ్డి షూటింగ్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్ లతో కొనసాగుతూనే ఉంది. మొదట్లో చిరు [more]

Update: 2019-01-02 08:15 GMT

చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న సై రా నరసింహ రెడ్డి షూటింగ్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్ లతో కొనసాగుతూనే ఉంది. మొదట్లో చిరు వెయిట్ తో ఇబ్బంది పడిన సై రా టీం ఇప్పుడు చిరు పూర్తి ఫిట్ నెస్ తో ఉండడంతో.. షూటింగ్ ని పరిగెత్తిస్తున్నారు. జార్జియాలో సై రా యుద్ధ సన్నివేశాలను పూర్తి చేసిన సురేందర్ రెడ్డి టీం ఇప్పుడు హైదరాబాద్ లో సై రా నరసింహారెడ్డి కోసం వేసిన ఒక స్పెషల్ సెట్ లో తదుపరి షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నాడు. అయితే షూటింగ్ లో ఎంత బిజీ ఉన్నప్పటికీ.. ఈ న్యూ ఇయర్ రోజున సై రా నరసింహ రెడ్డి లుక్ ని వదిలితే సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యేది. కానీ సై రా టీం మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఫ్యాన్స్ ని నిరాశపరిచారు.

ఇక తాజాగా సై రా తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ నగర శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీలో…. రాయలసీమ వాతావరణం ప్రతిబింబించే ఒక విలేజ్ సెట్ ను సిద్ధం చేస్తున్నారు. ఆ విలేజ్ సెట్ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటుంది. ఇక ఆ రాయలసీమ విలేజ్ సెట్ సై రా నరసింహ రెడ్డిలో నరసింహ రెడ్డి గూడెం పేరుతో కనిపించనుందని అంటున్నారు. ఇక ఈ సెట్ లో జరిగే సై రా షూటింగ్ లో సినిమాలో ముఖ్య కీలక పాత్రదారులైన నయనతార, అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతి బాబు, సుదీప్ లు పాల్గొంటారని సమాచారం.

ఇంకా ఈ రాయలసీమ నరసింహ రెడ్డి గూడెం సెట్ లో ఒక గ్రూప్ సాంగ్ ని కూడా సురేందర్ రెడ్డి షూట్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. సై రా నరసింహారెడ్డి.. నరసింహారెడ్డి గూడెం వేదికగా తీసుకునే కీలక నిర్మయాలు, అలాగే కొన్ని కీలక సన్నివేశాలను ఈ సెట్ లోనే చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం 70 నుండి 75 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సై రా నరసింహారెడ్డి విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వేసవిలో విడుదలయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి.

Tags:    

Similar News