మెగా ఫ్యాన్స్ రెచ్చిపోండిక..!

మెగాస్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది. నిన్నమొన్నటివరకు సైరా సినిమా [more]

Update: 2019-02-28 06:20 GMT

మెగాస్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది. నిన్నమొన్నటివరకు సైరా సినిమా రీషూట్స్ చేస్తున్నారని, విడుదల ఆలస్యం అంటూ అనేకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగాయి. ఇక నిర్మాత రామ్ చరణ్ కూడా సైరా నరసింహారెడ్డి సినిమా దసరాకి విడుదలవుతోందని కాస్త డౌట్ గానే చెప్పాడు. రీషూట్స్ చెయ్యడానికి అంత బడ్జెట్ లేదంటూ కబుర్లు చెప్పినా.. మధ్యమధ్యలో మీడియాలో సైరా షూటింగ్ పై వార్తలొస్తూనే ఉన్నాయి.

ఆగస్టులోనే వచ్చేస్తోంది…

ఇక తాజాగా ఈ సినిమా ఆగస్టులోనే రాబోతుందనే న్యూస్ కి మెగా ఫాన్స్ కి పిచ్చెక్కిచ్చేస్తోంది. మార్చి మొదటివారంలో సైరాలోని కీలకపాత్రలకు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేస్తే సైరా షూటింగ్ పూర్తవుతుందని చెబుతున్నారు. ఇక షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయని తెలుస్తుంది. అయితే నేషనల్ వైడ్ గా పలు భాషల్లో తెరకెక్కుతున్న సైరా సినిమా పబ్లిసిటీ, విడుదల డేట్ పై క్లారిటీ ఇవ్వకుండా తాత్సారం చేస్తే ఈలోపు బాలీవుడ్ నుండి భారీ మూవీస్ బరిలోకి దిగితే సైరా సినిమాకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది.

చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూపులు

అందుకే సైరా టీం ఇప్పుడు పక్కా వ్యూహంతో షూటింగ్ కంప్లీట్ చేసేసి సినిమా విడుదల డేట్ పై అతి త్వరలోనే క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట. కాకపోతే బయట సోషల్ మీడియాలో మాత్రం సైరా సినిమా ఆగస్టులోనే రాబోతుందని ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే సైరా సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వస్తే మెగా ఫాన్స్ కి పండగే. అసలే రంగస్థలం తర్వాత మెగా ఫాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. మెగా హీరోల్లో స్టార్ హీరోలైన అల్లు అర్జున్.. నా పేరు సూర్య పోవడం తర్వాత మళ్లీ మెగా బడ్జెట్ మూవీ ఏదీ విడుదల కాకపోవడంతో కాస్త డీలా పడిన మెగా ఫాన్స్ కి.. ఇప్పుడు బయటికొచ్చిన సైరా న్యూస్ కిక్కెక్కిస్తోంది.

Tags:    

Similar News