సైరా సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Update: 2018-10-24 06:18 GMT

చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అత్యంత భారీగా తెరకెక్కిస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని రామ్ చరణ్ దేశంలోని పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూన్నాడు. బాహుబలి తర్వాత మళ్లీ అంత భారీ బడ్జెట్, అన్ని అంచనాలున్న సినిమా సైరా నరసింహారెడ్డే. సైరా గురువుగా అమితాబ్ తో పాటు విజయ్ సేతుపతి, కన్నడ నటుడు సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా వంటి అగ్ర తారాగణం నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం జార్జియా దేశంలో షూటింగ్ జరుపుకుంటుంది.

పూర్తయిన క్లైమాక్స్ సీన్...

జార్జియాలో సైరా క్లైమాక్స్ ని దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక రేంజ్ లో తెరకెక్కస్తున్నాడు. ప్రస్తుతం ఆ యాక్షన్ సన్నివేశాలు ఫినిష్ అయినట్లుగా సైరా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసాడు. ఆ యాక్షన్ సన్నివేశాల్లో 300 మంది ఫైటర్స్, భారీ ఎక్విప్మెంట్ తో సుమారు 50 కోట్ల భారీ ఖర్చుతో క్లైమాక్స్ ని షూట్ చేసాడు సురేందర్ రెడ్డి. ఆ క్లైమాక్స్ షూట్ కోసం జార్జియాలో ఐదు వారాల పాటు... ఏకంగా ఐదుగురు హాలీవుడ్ ఫైట్ కొరియోగ్రాఫర్ల ఆధ్వర్యంలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అహోరాత్రులు శ్రమించి ఆ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా చెబుతున్నారు.

సినిమాకే హైలైట్

సైరా నరసింహారెడ్డి సినిమా మొత్తానికి క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తుంది అని మూవీ యూనిట్ చెబుతున్న మాట. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా... టాప్ టెక్నీకల్ టీం ఈ సినిమా కోసం పనిచేస్తుంది. ఇక ఈ సినిమాని వచ్చే వేసవికల్లా పూర్తి చేసి వేసవి సెలవల్లో విడుదల చెయ్యాలని చిత్ర బృందం భావిస్తుంది.

Similar News