సై రా డబ్బు రెస్టారెంట్ లో పెడుతున్నాడా?

చిరు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సై రా చరిత్ర ముగిసిపోయింది. ఎన్నో అంచనాలతో విడుదలైన సై రా తెలుగు రాష్ట్రలలో అదరగొట్టినా హిందీ లాంటి [more]

Update: 2019-10-31 06:20 GMT

చిరు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సై రా చరిత్ర ముగిసిపోయింది. ఎన్నో అంచనాలతో విడుదలైన సై రా తెలుగు రాష్ట్రలలో అదరగొట్టినా హిందీ లాంటి బిగ్ మార్కెట్ విషయంలో తేడా కొట్టింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వానికి మంచి మార్కులే పడ్డాయి. ఇక సురేందర్ రెడ్డి తదుపరి సినిమా సంగతేమో గాని… ప్రస్తుతం సురేందర్ రెడ్డి తన రెస్టారెంట్ బిజినెస్ మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. సై రా నరసింహారెడ్డి షూటింగ్ టైం లోనే రెస్టారెంట్ ఓపెన్ చేసిన సురేందర్ రెడ్డి.. ఇప్పుడు సై రా సినిమాకి తనకొచ్చిన రెమ్యునరేషన్ మొత్తాన్ని రెస్టారెంట్ బిజినెస్ మీదే పెడుతున్నట్లుగా టాక్.

సై రా సినిమా కోసమా భారీ (రమారమి 10 కోట్లు)పారితోషకం అందుకున్న సురేందర్ రెడ్డి.. ఇప్పుడు ఆ డబ్బుని తన రెస్టారెంట్ బిజినెస్ విస్తరణలో పెడుతున్నాడట. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ఏరియాస్ లో తన రెస్టారెంట్స్ ని విస్తరించాలని ప్లాన్ చెయ్యడమే కాకుండా…. ఇంకా చాలా చోట్ల ఈ ఫుడ్ బిజినెస్ ని మొదలెట్టబోతున్నాడట. సినిమాలు ప్లాపయినా.. రెస్టారెంట్ బిజినెస్ క్లిక్ అయితే ఇబ్బంది ఉండదని సురేందర్ రెడ్డి భావిస్తున్నాడట. మరి గతంలోనే చాలామంది హీరోలు (సందీప్ కిషన్, తరుణ్, నితిన్), నిర్మాతలు (అనిల్ సుంకర, కోన వెంకట్) ఇలా రెస్టారెంట్ బిజినెస్ లు మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News