పెళ్లికి రెడీ అయిన శ్వేతా బసు

Update: 2018-06-03 14:23 GMT

తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ శ్వేతా బసు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. టాలీవుడ్ లో 'కొత్త బంగారు లోకం' మూవీతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన ఈ స్వీట్ హార్ట్ తెలుగులో కొన్ని సినిమాలు చేసి కొన్ని కారణాలు వల్ల ముంబై వెళ్లి అక్కడ సెట్టిల్ అయింది.

అక్కడ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను ఆమె వివాహం చేసుకోనుంది. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా తమ నిశ్చితార్థం జరిగినట్టు శ్వేత స్వయంగా ప్రకటించింది. గోవా లో రోహిత్ కు తానే ప్రపోజ్ చేశానని, ఆ తర్వాత పూణెలో తన ప్రేమను రోహిత్ అంగీకరించాడని తెలిపింది. ఇంట్లోవాళ్లు కూడా తమ ప్రేమను అంగీకరించారని చెప్పింది.

అయితే తమ ఇద్దరి జీవితాలకు సంబంధించి వ్యక్తిగత విషయాలను చెప్పుకోవాలని తాము భావించడం లేదని తెలిపింది. త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నాం అని వెల్లడించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు మూడు మూవీస్ తో పాటు తెలుగులో అమెజాన్ ప్రైమ్ వారు నిర్మిస్తున్న 'గ్యాంగ్ స్టార్స్' అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తుంది శ్వేతా బసు

Similar News