నటి స్వాతి పెళ్లి పీటలు ఎక్కబోతోంది!

Update: 2018-08-13 09:52 GMT

మా టీవిలో 'కలర్స్' అనే ప్రోగ్రాం ద్వారా మనకు పరిచయం అయిన స్వాతి.. ఆ టీవీ షో ద్వారా పాపులర్ అయ్యి హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో చాలా సినిమాల్లో రాణించిన స్వాతి ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతోంది. 'అష్టాచెమ్మ' సినిమాలో మహేష్ బాబు పేరు వాడుకుని పేరు తెచ్చుకున్న స్వాతి ఆ తర్వాత వెంకటేష్ 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' ద్వారా స్వాతిలో అసలైన నటి బయటికి వచ్చింది.

మంచి నటిగా గుర్తింపు

దీంతో ఆమెకు తమిళంలో కొన్ని ఆఫర్స్ రావడంతో అక్కడ చాలానే సినిమాలు చేసి అక్కడ కూడా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా అక్కడ ఆమెకు 'సుబ్రమణ్యపురం' అనే సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నిఖిల్ తో చేసిన 'స్వామి రారా'.. 'కందిరీగ' లో రామ్ తో చిన్న పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.

పైలట్ తో వివాహం...

ఆ తర్వాత తెలుగులో నిఖిల్ సరసన 'కార్తికేయ' సినిమాలో నటించింది. ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు వికాస్. అతను మలేషియా ఎయిర్ లైన్స్ లో పైలట్. వీరిది లవ్ కమ్ అరెంజ్ మ్యారేజ్ అని తెలుస్తుంది. ఈనెల 30న హైదరాబాద్ ఎన్ డైమండ్ ఎన్ కన్వెన్షన్ హాల్ లో సాయంత్రం 7.30 నిమిషాలకు ఈ జంట ఒక్కటి కాబోతోంది. సెప్టెంబర్ 2న కొచ్చిన్ యూత్ క్లబ్ లో వీరి రిసెప్షన్ జరగనుంది.

Similar News