మైత్రి వారి కోసమే ‘మైత్రి’

సుకుమార్ – మహేష్ బాబు సినిమా రద్దయిన వ్యవహారంలో మైత్రి మూవీస్ వారికి తల బొప్పికట్టింది. మహేష్ తో సినిమాని సుకుమార్ మైత్రి వారికే చెయ్యాల్సింది. ఇప్పుడు [more]

Update: 2019-03-11 07:43 GMT

సుకుమార్ – మహేష్ బాబు సినిమా రద్దయిన వ్యవహారంలో మైత్రి మూవీస్ వారికి తల బొప్పికట్టింది. మహేష్ తో సినిమాని సుకుమార్ మైత్రి వారికే చెయ్యాల్సింది. ఇప్పుడు మైత్రి వారు సుకుమార్ వలన మహేష్ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఇపుడు మైత్రి వారి కోసం మహేష్ ని సుకుమార్ కలిసినట్లుగా ఒక వార్త టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు మహేష్ తో ఆగిపోయిన సినిమాపై స్పందించని సుకుమార్ ఇప్పుడు మహేష్ కోసం మహర్షి షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్లి మరీ కలిసి మహేష్ తో మాట్లాడాడని అంటున్నారు. మహేష్ తో సంప్రదించకుండా తాను అల్లు అర్జున్ తో సినిమా కమిట్ అవడంపై వివరణ ఇవ్వడమే కాకుండా మహేష్ కి సారీ కూడా చెప్పాడని టాక్ అయితే జోరుగా ప్రచారంలోకి వచ్చింది.

భవిష్యత్ కోసమే…

అంతేకాకుండా సుకుమార్ ఓ రోజు మొత్తం మహేష్ తోనే గడిపాడట. అయితే మహేష్ నవ్వి లైట్ తీసుకోమని చెప్పడమే కాకుండా మిగతా విషయాలు కూడా సుకుమార్ తో ముచ్చడించాడని చెబుతున్నారు. సుకుమార్.. మహేష్ ని కలవడం వెనుక మైత్రి మూవీస్ వారు ఉన్నారని.. వారి ప్రోద్భలంతోనే మహేష్ ని కలిసొచ్చినట్లుగా చెబుతున్నారు. ఫ్యూచర్ లో మహేష్ – సుకుమార్ కలిసి సినిమా చెయ్యకపోయినా మైత్రి మూవీస్ వారికి మహేష్ తో సినిమా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తేడాలు రాకూడదనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ కి మైత్రి వారు నచ్చజెప్పి మహేష్ వద్దకు పంపినట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.

Tags:    

Similar News